నటరత్న ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. తను దర్శకుడుగా మారి చేసిన సినిమాలు హిట్ అవ్వటం ఒకటైతే.. తన తర్వాత తన నట వారసుడుగా తన చిన్న కొడుకు బాలయ్య హిట్ కావడం ఆయన జీవితంలోనే మరో మరుపురాని ఘట్టంగా అన్నగారు పేర్కొన్నారు. వీటన్నిటికీ మించి నటరత్న ఎన్టీఆర్కు భారతీయ సంప్రదాయాలపై, శాస్త్రాలపై, ఆచరాలపై ఎంతో మొక్కువా దీంతో ఆయన తిరుపతి వెంకట కవులను తరచుగా కలుచుకునేవారు తన ప్రభుత్వంలో వారిని ఆస్థాన విధ్వంసులుగా కూడా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోని మన భారతీయ సంప్రదాయాలతో పెళ్లిళ్లు చేయడం కూడా నేర్చుకున్నారు. పూర్తి సాంప్రదాయ బద్దంగా ఎన్టీఆర్ వివాహాలు చేయడంలో దిట్టగా మారారు. దీనికి గాను ఎన్టీఆర్ చాలానే కష్టపడ్డారు. ఎంతో కష్టపడి పెళ్లిళ్లు చేయటం అయితే నేర్చుకున్నారు కానీ ఎన్టీఆర్ తో వివాహం చేయించుకునే వారు ఎవరు ? అనే విషయం మాత్రం అలా మిగిలిపోయింది. అదే సమయంలో ఎన్టీఆర్ గారి మనసు తెలిసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎవరు ఊహించిని విధంగా ఓ చిన్న ప్రయత్నం చేశారు.
టీడీపీలో కొత్తగా చేరిన మోహన్రెడ్డి అప్పుడే తన కుమార్తె వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం.. యార్లగడ్డకు తెలిసింది. వెంటనే ఆయన.. ఖర్చు అంతా కూడా తానే భరిస్తానని.. చెప్పి.. దీనికి ఒక కండిషన్ పెట్టారట. అన్నగారు వివాహ సంప్రదాయాన్ని ఔపోసన పట్టారని ఆయనతో నీ కుమార్తె వివాహం చేయించు.. అంతా బాగుంటుందని సలహా ఇచ్చారు.
ఇలా.. తొలి సారి మోహన్రెడ్డి కుమార్తె వివాహానికి అన్నగారు స్వయంగా మంత్రాలు చదివి మరీ.. వివాహం చేయించారట. తర్వాత.. మరికొందరు వచ్చినా..అన్నగారు బిజీకావడంతో ఇక, ఆ తర్వాత ఎవరి వివాహాన్ని చేయించలేదు. ఇదే తొలి, చివరిది కావడం గమనార్హం. అందుకే ఈ ఘట్టని అన్నగారి జీవితంలో మరపు రాని ఘట్టంగా మిగిలిపోయిందని అంటారు.