అతిలోకసుందరి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. నటరత్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఆయనకే జంటగా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఎన్టీఆర్- శ్రీదేవి కాంబో అంటే పిచ్చ క్రేజీ ఉండేది. శ్రీదేవి తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ను సొంతం చేసుకుంది.
ఇక శ్రీదేవి తన సినీ కెరీర్ లో ఎక్కువగా నటరత్న ఎన్టీఆర్ తోనే సినిమాలు చేసిందని విషయం చాలామందికి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ తో శ్రీదేవి సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆయను శ్రీదేవి ఏమని పిలిచేదో తెలిస్తే మాత్రం అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి పులి సినిమాలో ఎన్టీఆర్కు జంటగా శ్రీదేవి హీరోయిన్గా నటించే పరిస్థితి వచ్చింది.
అలాంటి సమయంలో కూడా శ్రీదేవి ఎలాంటి భయం లేకపోయినా బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవితో రొమాన్స్ చేయడానికి మాత్రం ఎన్టీఆర్ ఎంతో ఇబ్బంది పడ్డారట. ఇక ఆయనతో నటించాలని శ్రీదేవిని ఎవరూ బలవంతం చేయలేదట. కానీ ఎంతైనా వీరి మధ్య వయసు బేధం చాలా ఉండడం వల్లే అటు శ్రీదేవికి.. ఇటు ఎన్టీఆర్ కి కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది అని చెప్పవచ్చు. అయితే శ్రీదేవి ఈ సినిమాలో నటించడానికి ముఖ్య కారణం దాసరి నారాయణరావు.. ఆమెను ఒప్పించింది ఆయనే.. మొదట్లో ఆమె ఇబ్బంది పడ్డా కూడా నేను అంతా చూసుకుంటానని చెప్పి ఆమెను ఒప్పించారట.
అదే సమయంలో శ్రీదేవి ఎన్టీఆర్ తో నటించిన బడుపంతులు సినిమా దగ్గరనుంచి ఎన్టీఆర్ ను అంకుల్ అని పిలిచే అలవాటు ఉన్న నేపథ్యంలో హీరోయిన్గా నటించిన కూడా అలాగే పిలిచేదట. ఎన్టీఆర్ కూడా దాన్ని ఎంతో సరదాగా తీసుకునే వారిని తెలుస్తుంది. బొబ్బిలి పులి సినిమా సమయంలో శ్రీదేవి వయస్సు కేవలం 22 సంవత్సరాలు కాగా ఎన్టీఆర్ వయసు 50 కు పైగా ఉండేది. అలా ఎన్టీఆర్- శ్రీదేవి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.