తెలుగు ఇండస్ట్రీలో అలనాటి ఆణిముత్యం లాంటి సినిమాలలో మల్లీశ్వరి ఒకటి. ఈ సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్లుగా నటించారు. బియన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా దర్శకుడు బి.యన్.రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మల్లీశ్వరి సినిమా షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను వివరించారు.
ఈ సినిమా షూటింగ్ టైంలో భానుమతి ఓ సీన్లో హెయిర్ స్టైల్ మార్చుకుని వచ్చిందని.. ముందు సీన్లో హెయిర్ స్టైల్ ఎలా ? ఉందో ఇది అలాగే ఉండాలి మార్చుకుంటే ఎలా అని తాను కేకలు వేశానని ఆయన చెప్పారు. తాను సెట్ లో అందరి ముందు నేను అలా కోప్పడంతో భానుమతి అలిగి మేకప్ రూమ్ కి వెళ్లిపోయిందట. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. పిలిస్తే ఆవిడ రాదు.. హెయిర్ స్టైల్ ముందు దృశ్యం ఉన్నట్టుగానే మార్చుకొని రమ్మంటున్నారని సహాయకులు చెప్పినా భానుమతి బయటకి రాలేదన్నారు.
ఆవిడ అక్కడ అలక.. ఇక్కడ నాకు ఆగ్రహం.. ఇలా అయితే సినిమా ఎలా ? పూర్తవుతుంది ఎంత డబ్బు ఖర్చు చేసి సినిమా తీయాలని అనుకుంటే భానుమతి తాను తప్పు చేసి అలగడం ఏంటి ఇక లాభం లేదు.. పడుతున్న శ్రమంత బూడిద పాలవ్వకూడదని తానే రాజీపడ్డానని బి.యన్.రెడ్డి నాటి సంగతి గుర్తు చేసుకున్నారు. భానుమతిని ముందు సీన్లో ఉన్నట్టుగానే హెయిర్ స్టైల్ చేసుకుని తర్వాత రోజు రమ్మని మేనేజర్ తో కబురు పంపానని.. తాను వెళ్లి చెప్పాడని.. అలా ఆరోజు షూటింగ్ ఆగిపోయిందన్నారు.
సంగీత దర్శకుడు రాజేశ్వరరావుతో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను.. ఏదైనా చెబితే అలిగి వెళ్లిపోయేవాడు… అయినా నా సినిమాకు అతడే కావాలి.. అతడి దగ్గర మంచి సంగీత విద్య ఉందని తాను రాజీ పడక తప్పలేదన్నారు. ఈ సినిమాకు పని చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు, భానుమతి వీళ్ళు ముగ్గురు మహానుభావులే కానీ నన్ను చాలా అవస్థలు పెట్టేవారు… వీళ్ళతో మల్లేశ్వరి సినిమాను ఎలా ? తీసానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుందంటూ వివరించాడు బి.ఎన్.రెడ్డి.