జెడి చక్రవర్తి కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలో గులాబీ సినిమా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో తర్కెక్కిన ఈ సినిమాలో మహేశ్వరి హీరోయిన్గా నటించింది. 1995లో విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జె.డి చక్రవర్తి మెయిన్ రోల్లో ఈషారెబ్బ, విష్ణుప్రియ, కమల్ కామరాజు తదితరులు కీరోల్స్ ప్లే చేసిన వెబ్ సిరీస్ దయ. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్నారు జేడీ చక్రవర్తి.
ఈ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్ గా కృష్ణవంశీ, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు. చక్రవర్తి మాట్లాడుతూ పవన్ సాధినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ వెబ్సీరీస్ ఆగస్టు 4న ఓటిటి డిస్నీ హాట్స్టార్లో విడుదల కానుందట. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఈ సిరీస్ రూపొందించబడిందట. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ తాను ఈ స్టేజ్లో ఉండడానికి కృష్ణవంశీనే ప్రధాన కారణం. సుమారు 25 ఏళ్ల తర్వాత మేమిద్దరం ఇలా ఒక వేదికపై కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు పవన్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు చక్రవర్తి.
ఇక గులాబీ సినిమా గురించి వివరించే సమయం ఇది కాదు.. కానీ తప్పదు చెప్పాలి. కృష్ణవంశీని చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా పరిచయం చేసేందుకు కథను వినిపించమని హీరో రాజశేఖర్ దగ్గరకు నేను తీసుకువెళ్లానని.. అప్పుడు వంశీ గులాబీ కధ చెప్పకుండా వేరే కాథ చెబుతుంటే మధ్యలో నేను గులాబీ కథను చెప్పమని చెప్పడంతో అతడు రాజశేఖర్ కు గులాబీ కథను చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ఆ కథలో నా పాత్రను రాజశేఖర్ పోషిస్తానని… బ్రహ్మాజీ పాత్రను నేను పోషించాలని రాజశేఖర్ కృష్ణవంశీకి కండీషన్ పెట్టాడని చెప్పాడు.
వెంటనే కృష్ణవంశీ అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేసాడట. గులాబీ సినిమా చేస్తే చక్రితోనే చేస్తా మరొకరితో చేయను అని కృష్ణవంశీ చెప్పాడట. దానికి ఇప్పటికీ నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతాను. ఈ ఈవెంట్ కి కృష్ణవంశీని రమ్మని నేను బ్రతిమలాడలేదు.. డిమాండ్ చేశాను.. ఆయన వచ్చారని చెప్పుకొచ్చాడు. ఇక గులాబీ సినిమా టైంలో కృష్ణవంశీకే రాజశేఖర్ కండిషన్ పెట్టి సినిమా మిస్ చేసుకోవడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.