మనం చూసే సినిమాల్లో తెరమీద పేలే జోకులే మనకు తెలుసు. కానీ, తెరవెనుక.. సినిమా నటుల మధ్య కూడా జోకులు పేలేవి. ఇప్పటికీ.. సినిమా నటులు కలిస్తే జోకులు కుమ్మేసుకుంటారు. ఇలానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా.. తెలుగు సినిమాల్లో శోభన్బాబుపై సటైర్లు వేసేవారు. అది కూడా .. వాణిశ్రీ, శారద, శ్రీలక్ష్మి వంటివారు జోకులు పేల్చేవారట. కారణాలు ఏవైనా కూడా.. శోభన్బాబుతో కలిసి నటించేందుకు ఈ ముగ్గురూ పోటీ పడేవారు.
వీరితర్వాత.. అంటే.. ఆ తరం తర్వాత.. జయప్రద, జయసుధ, శ్రీదేవిలు కూడా శోభన్బాబుతో కలిసి తెర పంచుకునేందుకు ఉవ్విళ్లూరే వారు. జయప్రద అయితే.. తాను ఎంత బిజీగా ఉన్నా.. షెడ్యూల్ ను సవ రించుకుని మరీ కాల్షీట్లు ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్లను అర్ధరాత్రి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. వాణిశ్రీ.. ఎందుకో గానీ శోభన్బాబు అంటే.. ప్రాణం పెట్టేవారట.
శోభన్తో కలిసి నటించేందుకు వాణిశ్రీ అప్పట్లో ఒకటి రెండు ఆఫర్లు కూడా వదులుకున్నారని చెబుతారు. ఇక, శారద కూడా.. మానవుడు- దానవుడు సినిమా తర్వాత.. మరింత ఎక్కువగా చనువు పెంచుకున్నారని అంటారు. వీరిద్దరితోనూ.. ఈవీవీ సత్యనారాయణ తర్వాత తీసిన సినిమా కూడా హిట్ అయింది. ఏవండీ ఆవిడొచ్చింది.. టైటిల్తో వచ్చిన సినిమా మళ్లీ తెరమీద కొత్త ఉత్సాహం నింపింది.
ఇదిలావుంటే.. ఈ సినిమా సందర్భంలో వాణిశ్రీ తెగ మాట్లాడేదట. శోభన్బాబుతో నటించడం అంటే.. సొంత మొగుడుతో నటించినట్టే ఉంటుందని ఆమె నవ్వుతూ జోక్ చేసేవారట. అప్పట్లో అందరూ ఈ మాట విని నవ్వుకునేవారు. వారి మధ్య అంత చనువుకు కారణం.. వ్యక్తిగతంగా కూడా.. వాణిశ్రీకి.. ఇష్టం కావడమేనని అంటారు.