మందుకు ఎడిక్ట్ అయ్యా… నాగార్జున హీరోయిన్ విడాకుల వెన‌క ఏం జ‌రిగింది..!

బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఇండియన్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం సినిమాలలో నటించింది. ఆమె నేపాలలో జన్మించింది. 1991లో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ గై దర్శకత్వంలో వచ్చిన సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అంతకుముందే ఆమె 1989లో పేర్ భూతౌలా అనే నేపాలి సినిమాలో కూడా నటించింది.

అప్పటినుంచి ఆమె తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్లో స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలలో నటించింది. ఆమె నటించిన బొంబాయి సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో నాగార్జున జోడిగా క్రిమినల్, అర్జున్‌తో ఒకే ఒక్కడు, నగరం, భారతీయుడు, బూచి, లేడీ టైగర్, నోటుకు పోటు లాంటి సినిమాలలో నటించింది. రీసెంట్గా కార్తీక్ ఆర్య హీరోగా నటించిన షెహ‌జాదా సినిమాలో హీరోకు అమ్మ పాత్రలో నటించింది.

మనీషా కొయిరాలా చిన్న వయసులోనే ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో అంతే త్వరగా ఆమె కెరీర్ కూడా పతనం అయింది. అప్పట్లో ఆమె బాగా మద్యానికి బానిస అయింది అన్న ప్రచారం జరిగింది. మనీషా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం సేవిస్తూ ఉండేదని.. మత్తులో ఉన్న ఆమె షూటింగులకు కూడా అలాగే వచ్చేదని.. అందుకే ఆమెకు ఎవరు ఛాన్సులు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదన్న ప్రచారం జరిగింది.
మద్యపానం వల్లే తన జీవితంలో చాలా కష్టాలు పడ్డానని కూడా మనిషా తెలిపింది.

మద్యం నా జీవితంలోకి వచ్చాక నా కెరీర్ అంతా తలకిందులు అయిపోయింది.. నా జీవితం ఇంతలా మారిపోతుందని నేను అనుకోలేదు.. అప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని మనిషా వాపోయింది. ఇక మనీషా 2010లో తన తోటి నేపాలి బిజినెస్మెన్ సామ్రాట్ ద‌హాల్‌ని పెళ్లాడింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఏది ఏమైనా మద్యానికి బానిస అవటం వల్ల మనీషా కెరీర్‌ ఎలా ? పతనమైందో పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి.