పవిత్ర పై మొదటి భర్త సెన్సేషనల్ కామెంట్స్..నరేష్ ను అందుకే బుట్టలో పడేసిందా..?

టాలీవుడ్ లో గత కొద్ది నెలలుగా సీనియర్ నటుడు నరేష్ సీనియర్ నటిమని పవిత్ర లోకేష్ సహజీవనం ఎంత చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే. వీరిద్దరి సహజీవనం గురించి ప్రతిరోజు అనేక రకాల వార్తలు తెలుగు మీడియాలోను సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కలిసే జీవిస్తున్న ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు అంటూ చాలాసార్లు చెప్పారు.

Suchendra prasad about Pavitra lokesh regarding mysore hotel incident|  మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్.. అవి బయటపెడతానన్న సుచేంద్ర  ప్రసాద్! News in Telugu

అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది అందుకే నరేష్- పవిత్ర పెళ్లి ఇంకా ఆలస్యం అవుతోంది. పవిత్ర లోకేష్ పై ఆమె రెండో భర్త కన్నడ సీరియల్ నటుడు సుచేంద్రప్రసాద్ ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే వస్తున్నాడు. ఇటు నరేష్ పై మూడో భార్య రమ్య రఘుపతి కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన పవిత్ర భర్త సుచిత్ర ప్రసాద్ ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవిత్రకు ముందు నుంచి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం అని అందుకోసం ఆమె ఏమైనా చేస్తుందని విమర్శలు చేశారు. పవిత్ర లోకేష్ ప‌చ్చి అవకాశవాది అని నరేష్‌ను ఆమె మాయలో పెట్టి బుట్టలో వేసుకుందని ఆరోపించారు. నరేష్ తల్లి విజయనిర్మల లేకపోవడంతో నరేష్‌ను మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలని పవిత్ర ప్లాన్ చేసిందని అందుకే నరేష్‌తో సహజీవనం చేస్తుందని సుచేంద్ర తీవ్ర విమర్శలు చేశారు.

Suchendra Prasad shocking comments On his wife Pavitra Lokesh | పవిత్రకు  కాపురాలు కూల్చడం అలవాటే.. ఆరు నెలల్లో నరేష్ సొమ్ము స్వాహా! సుచేంద్ర సంచలన  వ్యాఖ్యలు– News18 Telugu

కేవలం ఆమె డబ్బు కోసమే తనకు విడాకులు ఇచ్చిందని డబ్బు కోసమే నరేష్ వెంట తిరుగుతుందని ఏదో ఒక రోజు నరేష్‌ను కూడా ఆమె వదిలేస్తుందని సుచిత్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు కన్నడ తెలుగు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సుచీంద్ర- పవిత్ర దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నరేష్ పవిత్ర లోకేష్ తాజా జీవితంపై తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.