టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. పదేళ్ల క్రితం సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల ట్రెండుకు శ్రీకారం చుట్టారు. ఇక ఎవ్వరు ఊహించిన విధంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి సెన్సేషనల్ క్రియేట్ చేశారు. పదేళ్ల క్రితం టాలీవుడ్ లో వెంకటేష్ – మహేష్ బాబు కాంబినేషన్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.
స్టార్ హీరోలుగా ఉన్న ఈ ఇద్దరు కలిసి నటించడం అంటేనే అప్పట్లో ఓ సంచలనం. దిల్ రాజు బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. చాలా రోజులు తర్వాత ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి.. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడం గొప్ప విశేషం. సినిమా కూడా అంచనాలకు తగ్గకుండా సూపర్ హిట్ అయింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఇదే చివరి బ్లాక్ బస్టర్. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ మరోసారి మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమా చేస్తే పెద్ద డిజాస్టర్ అయింది. ఇక సీతమ్మవాకిట్లో సినిమా కథ శ్రీకాంత్ రాసుకున్నప్పుడే వెంకటేష్ ఒక హీరోగా ఫిక్స్ చేసుకున్నాడట. ఇక రెండో హీరోగా మహేష్ బాబు ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకుందాం అనుకున్నారట. అప్పట్లో వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉంటారన్న వార్త కూడా వినిపించింది.
పవన్ అప్పటికే అత్తారింటికి దారేది సినిమా షూటింగుకు కాల్ సీట్లు ఇచ్చేశారు. దీంతో పవన్ ప్లేస్ లో మహేష్ బాబును తీసుకున్నారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా 55 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అప్పట్లో ఓవర్సీస్ లో వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. పది సంవత్సరాల క్రితమే రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఆ తర్వాత అదే విక్టరీ వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గోపాల గోపాల సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.