ఏఎన్నార్ అంటే చ‌చ్చేంత ఇష్టం ఉన్నా పెళ్లికి నో చెప్పిన సావిత్రి… అస‌లు క‌థ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో మహానటిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సావిత్రి దురదృష్టవశాత్తు 46 ఏళ్లకే కన్ను మూసింది. ఆమె భర్త జెమినీ గణేష్ తనకు చేసిన అన్యాయాం వ‌ల్ల మందుకి బానిస అయ్యి తమ బాధని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయి కన్ను మూసింద‌నే ఆమె గురించి చాలా మంది క‌థ‌లు క‌థ‌లుగా చెపుతుంటారు. లేదంటే ఇప్పటికీ ఆమె మన మధ్యనే ఉండేది.

ఈ తరం వాళ్లకి సావిత్రి గురించి తెలియకపోవచ్చు. మహానటి సినిమాతో అందరికీ సావిత్రి గొప్పతనం తెలిసింది. ఆమెను ఇప్పటికీ ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆమె గురించి తెలియని విషయాలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అప్పట్లో సావిత్రి దేవదాసు సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించారు.

ఆ తర్వాత కూడా మూగమనసులు, సుమంగళి, అర్ధాంగి, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలలో సావిత్రికి ఏఎన్ఆర్ జతగా నటించారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరినీ కట్టిపడేసింది. ఆ నేపథ్యంలోనే ఏఎన్ఆర్ – సావిత్రి ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ఏఎన్ఆర్ కి సావిత్రి అంటే చచ్చేంత ఇష్టమని, పెళ్లి చేసుకుంటావా అని ఎంత అడిగినా, అందుకు మాత్రం ఆమె ఒప్పుకోలేదట. ఆ ఒక్క పుకారు మాత్రమే కాదు ఏఎన్ఆర్, సావిత్రి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఆ అబద్ధాల‌ను ప‌దే ప‌దే విని, చూసి విసుగు చెందిన సావిత్రి ఒక రోజు వీటిపై సీరియస్ అయ్యింది. ఏఎన్ఆర్ నాకు మధ్య ఏదో ఉందని వస్తున్న ప్రచారాన్ని అబద్ధమే.. ఏఎన్ఆర్ గారు నాకు మంచి స్నేహితుడు మాత్రమే అంతకుమించి మా మధ్య ఏమి లేదు… ఇప్పటికీ నమ్మకపోతే అది వారి ఇష్టం అని క్లారిటీ ఇచ్చింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఏఎన్ఆర్ ఆమెను సరదాగా ఆటపట్టించే వారట. ఏం సావిత్రి నేను అందంగా లేనా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? అంటూ ఆమెని ఏడిపించే వారట. ఆ మాటలు విన్న సావిత్రి కడుపారా నవ్వేదట.