మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఇగోలు, పంతాలు, పట్టింపులు నడుస్తూ ఉంటాయి. ఎవరికి వారు తమకు తామే గొప్ప అనుకుంటూ ఉంటారు. అయితే అవి చాలావరకు నేరుగా బయటపడకపోయినా వాళ్ళ బిహేవియర్ ద్వారా నిజమే అని తెలుస్తూ ఉంటాయి. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న పూజా హెగ్డే – సమంత మధ్య సఖ్యత లేని మాట వాస్తవం. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్ల అభిమానులు కూడా కౌంటర్లతో రెచ్చిపోతూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఇద్దరూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నా సమంత అయితే వెనకపడిపోయినట్లుగా ఉంది. పూజాకు ఉన్న క్రేజ్, ఛరిష్మాతో పోలిస్తే సమంతకు అది కాస్త తగ్గింది. ముఖ్యంగా చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత గ్రాఫ్ బాగా డౌన్ అవుతూ వస్తోంది. ఇక తాజాగా వచ్చిన శాకుంతలం సినిమా సమంత పరువును మరింత పోయేలా చేసింది.
ఇక పూజాకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గినట్టు ఉన్నా ఇప్పటకీ ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్బాబు – త్రివిక్రమ్ సినిమాలో ఆమే హీరోయిన్. అయితే పూజాది కూల్ మనస్తత్వం.. ఆమె పెద్దగా ఏదీ పట్టించుకోదు. సమంత అలా కాదు అన్నీ పట్టించుకునే టైప్. చివరకు ఎవరికి గుర్తు ఉండని అవుట్ డేటెడ్ నిర్మాత చిట్టిబాబు లాంటి వాళ్లు తనను కామెంట్ చేసినా ఆమె పట్టించుకుని మరీ కౌంటర్లు వేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం సమంత ఖుషి సినిమా చేస్తోంది. అది కూడా ప్లాప్ అయితే అసలు ఆమెను పట్టించుకునే వారే ఉండరు. ఇక సమంత కంటే పూజ మంచి హైట్ ఉంటుంది. సమంతతో పోలిస్తే మంచి పర్సనాలిటీ, మంచి ఛరిష్మా కూడా ఆమె సొంతం. ఇక పూజా మంచి ఫామ్లో ఉన్నప్పుడు సమంతకు రావాల్సిన కొన్ని ఛాన్సులు ఎగరేసుకుపోయింది. ఈ కారణాల వల్లే సమంత – పూజ మధ్య కోల్డ్వార్ స్టార్ట్ అయ్యింది.
ఆ తర్వాత ఈ వార్లోకి ఇద్దరు హీరోయిన్ల అభిమానులు ఎంటర్ అయిపోయారు. సోషల్ మీడియాలో పూజ ఫ్యాన్స్ సమంతను టార్గెట్ చేస్తే, సమంత ఫ్యాన్స్ పూజను టార్గెట్ చేశారు. అలా ఈ వార్ కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే ఇంత వార్ జరుగుతున్నా పూజ ఎప్పుడు కూల్గానే ఉంటుందని.. సమంత మాత్రం కాస్త అతిగా ఆవేశపడుతూ ఉంటుందన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.