టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ఒక సంచల నిర్ణయం తీసుకుంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఈ నిర్ణయంలోనూ ఓ ట్విస్ట్ ఉంది. సమంత సినిమాలకు ఒక ఏడాది బ్రేక్ ఇవ్వాలనుకుంటుందట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది.
మరో 4,5 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుందట. దీంతోపాటే అమెజాన్ తెరకెక్కిస్తున్న బాలీవుడ్ వెబ్ సిరీస్ సీటాడెల్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందట. ఈ రెండు షూటింగులు పూర్తయిన తర్వాత సమంత ఇక ఏ ఇతర సినిమాలలో నటించడానికి సైన్ చేయటం లేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకుందట. అనారోగ్యంతో బాధపడుతున్న సామ్ సినిమాలకు ఒక ఏడాది బ్రేక్ ఇచ్చి అదనపు చికిత్స తీసుకొని పూర్తిగా కోల్పోవడానికి ప్రయత్నిస్తోంది. దీంతో గతంలో తాను కుదుర్చుకున్న ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అడ్వాన్సులు కూడా ప్రొడ్యూసర్స్ కి రిటన్ ఇచ్చేసిందట.
చాలా కాలం నుంచి మయోసైటీస్తో బాధపడుతున్న సమంత యశోద సినిమా షూటింగ్ టైం లో భాగంగా చేతికి సిలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయాయి. ఆ తర్వాత ఇలాంటి సందర్భాలు కొన్నిసార్లు కనిసపించ్చాయి. దీంతో సినిమాలకు కొన్ని బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం పై దృష్టి సారిస్తోంది సమంత.