టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పదేళ్లపాటు ఒక వెలుగు వెలిగింది చెన్నై ముద్దుగుమ్మ సమంత. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత అతడని పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కూడా కాపురం చేయకుండానే మనస్పర్ధల నేపథ్యంలో విడాకులు ఇచ్చేసింది. నిజానికి నాగచైతన్యతో ప్రేమకు ముందు.. ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ ఆకాశపు అంచులకు చేరుకుంది.
ఎప్పుడు ? అయితే చైతన్యకు విడాకులు ఇచ్చేసిందో అప్పటినుంచి సమంత గ్రాఫ్ దిగజారుతూ వచ్చింది. చైతుతో విడాకులు తర్వాత ఆమె మయోసైటిస్ వ్యాధికి గురయ్యి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. యశోద సినిమా టైంలో ఆమె సింపతి గేమ్ ప్లే చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా గట్టెక్కింది. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వచ్చిన శాకుంతలం సినిమా కోసం కన్నీళ్లు కార్చడంతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టుకుంది.
అయితే సమంత పదేపదే సింపతి గేమ్ వాడటాన్ని గమనించిన ప్రేక్షకులు కథలో ఏమాత్రం దమ్ము లేని శాకుంతలం సినిమాను అట్టర్ ప్లాప్ చేసేసారు. ఆ తర్వాత సీటాడెల్ వెబ్ సిరీస్ అంటూ ఏకంగా లండన్ ప్రమోషన్లలో కూడా పాల్గొంది. ఎందుకో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సమంత ఉన్నా ఏ మాత్రం క్రేజ్ రావటం లేదు. మరోవైపు ఒకప్పుడు నెత్తిన పెట్టుకుని సమంతను ఊరేగించిన టాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు.
స్టార్ హీరోలు కూడా సమంత వైపు కన్నెత్తి చూడటం లేదు. నిజానికి సీనియర్ హీరోలకు.. స్టార్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉండటంతో సమంత మంచి ఆప్షన్. కానీ అసలు సమంత అంటేనే మన హీరోలు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా ఇప్పుడు యేడాది పాటు తాను సినిమాలకు దూరంగా ఉంటానని కొత్త సింపతీ గేమ్ మొదలుపెట్టిందన్న విమర్శలు సమంత వైపు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆశలు అన్ని విజయ్ దేవరకొండకు జోడిగా నటిస్తున్న ఖుషి సినిమా మీదే ఉన్నాయి.
ఈ సినిమా కోసమే సమంత మళ్ళీ సింపతి గేమ్ స్టార్ట్ చేసిందని టాలీవుడ్ జనాలు చెవులు కోరుకుంటున్నారు. తాజాగా ఆమె కారవాన్ ఫోటో పెట్టి మరో మూడు రోజులు మాత్రమే ఇందులో ఉండేది.. ఆరు నెలలు కష్టంగా గడిచాయి.. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అని కామెంట్ చేసింది. అయితే కొందరు సమంత చాలా బాధలో ఉందని చెబుతున్నా ఎక్కువమంది మాత్రం ఆమె ఖుషి సినిమా హిట్ అయ్యేందుకు కొత్త గేమ్ మొదలుపెట్టిందని.. ఆమెను ఆమె సింపతి గేమ్ ను ఇకపై ఎవరూ నమ్మరని విమర్శలు చేస్తున్నారు.