‘ స‌లార్ ‘ రిజ‌ల్ట్ తేడా కొట్టేస్తోందా… హోంబ‌లే వాళ్లు అందుకే ఓన్ రిస్క్ చేయ‌లేదా…!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా సలార్. హోంబలే ఫిలింస్‌ బ్యానర్ పై ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. కేవలం ఈ సినిమా రెండు రాష్ట్రాల హక్కులని అమ్మడానికి రూ.180 కోట్లు అడుగుతున్నారట. అలా అయితే రూ.170 కోట్లు అయినా వస్తాయని అంచనా వేసినట్లు తెలుస్తుంది. కాగా ఇంతకుముందు ఈ బ్యానర్ పై తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు కేజిఎఫ్ , కాంతారా ఇలా అమ్మలేదు.

అడ్వాన్సులు లేకుండా అప్పటికప్పుడు నామినల్ కమీషన్ వేలో సినిమాను ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. అందుకే ఆ రెండు సినిమాల‌కు హోంబ‌లే వాళ్ల‌కు భారీ లాభాలు వ‌చ్చాయి. అలాంటిది ఇప్పుడు స‌లార్ ఏపీ, తెలంగాణ హ‌క్కులు ఎందుకు..? అమ్మాలనుకుంటున్నారు.. సలార్ రిజల్ట్ పై నిర్మాతలకు అప్పుడే తేడా కొట్టేసిందా ? అందుకే హోంబలే సంస్థ వారు హక్కులను అమ్మేస్తున్నారా? అనే సందేహం అందరిలో మొదలైంది.

కానీ దీని వెనక వేరే కారణం ఉందట. గతంలో కొన్ని ఓటీటీ సంస్థలు భారీ బడ్జెట్ సినిమాలను కొనుగోలు చేసి నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం ఓటీటీ సంస్థలు ఏవి రూ.125 కోట్ల బడ్జెట్‌ని మించిన సినిమాలను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సలార్ సినిమా అమ్మకాలు ఆగిపోయాయట.

ఈ కారణంగానే పెట్టుబడి తట్టుకోవాలని.. రిలీజ్‌కు ఇబ్బంది ఉండ‌కూడ‌ద‌న్న‌ ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల హక్కులను ఎలాగైనా అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న సినిమాలు సలార్, ప్రాజెక్ట్ కే రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి కూడా ఓటిటి సంస్థలు రూ.125 కోట్లు బడ్జెట్ మించి పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకోవడం కూడా నిర్మాత‌లు ఈ సినిమా రైట్స్ అమ్మ‌డానికి ప్ర‌ధాన‌ కారణమని తెలుస్తుంది.