మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఇటీవల ‘ విరూపాక్ష ‘ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్తేజ్ ప్రస్తుతం మేనమామ పవన్తో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘ బ్రో ‘ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్, నటుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలీవుడ్లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ హ్యాపీ మూమెంట్లో సాయిధరమ్ తేజ్ ఓ సంచల నిర్ణయం తీసుకుని ఫాన్స్కు పెద్ద షాక్ ఇచ్చాడు. కొంత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నాను.. కనీసం ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటానని సాయి ధరమ్ చెప్పుకొచ్చాడు.
తన ఆరోగ్య రీత్యా 6 నెలలు విరామం తీసుకుంటున్నానని.. పూర్తిస్థాయిలో ఆరోగ్యం కుదుటపడిన తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తానని.. అప్పటివరకు సినిమాలకు దూరంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాని హింట్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని ఫ్యాఫాన్స్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్.
బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్తేజ్ పూర్తిగా కోల్పోక ముందే విరూపాక్ష సినిమాలో నటించాడు. ఆ యాక్సిడెంట్ టైంలోనే రిపబ్లిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందింది. తర్వాత కోలుకున్నా విరూపాక్షతో బ్లాక్బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం బ్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి ధరమ్తేజ్ ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.