దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మల్టీస్టారర్ గా తెర్కెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పటికీ ఎన్నో అదిరిపోయే రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్- రామ్ చరణ్ కు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ కూడా వచ్చింది. అంతేకాకుండా రాజమౌళి ఈ సినిమాతో ఎన్నో సంవత్సరాలకు ఎదురుచూస్తున్న ఆస్కార్ను కూడా ఇండియాకు అందించాడు.
ఈ సినిమా ఇండియాలోనే రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా… ఓవర్సీస్లో కూడా అదే రీతిలో ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను గత సంవత్సరం జపాన్లో భారీ స్థాయిలో విడుదల చేయగా అక్కడ కూడా ఎవరు ఊహించని సెన్సేషనల్ రికార్డులతో ఇప్పటికీ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 2 బిలియన్ కి పైగా జపాన్ ఎన్ వసూళ్లు రాబట్టింది.
ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమా అక్కడ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో ఒకటైన హాలీవుడ్ సినిమా “డాక్టర్ స్ట్రేంజ్ 2” ని క్రాస్ చేసింది. దీంతో జపాన్ లో భారీ కలెక్షన్లు రాబెట్టిన ఆల్ టైం ఫారెన్ సినిమాల్లో టాప్ -7 లో త్రిబుల్ ఆర్ చోటు దక్కించుకుంది. దీంతో ఈ సినిమా హవా ఇప్పటికీ గట్టిగానే కొనసాగుతుందని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ త్రిబుల్ ఆర్ జపాన్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఏ ఇండియన్ సినిమాకు అయినా ఇది అక్కడ అన్బీటబుల్ రికార్డే అని చెప్పాలి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. అలియాభట్, ఓవీలియా మోరీస్ హీరోయిన్లుగా నటించారు.