సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గత ఎన్నికలకు ముందు నుంచి ఏపీ పాలిటిక్స్ను టార్గెట్గా చేసుకుని వరుసగా సినిమాలు చేస్తున్నారు. గత ఎన్నికల టైంలో ఏపీలో చంద్రబాబును, టీడీపీని టార్గెట్ గా చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ సినిమాపై టీడీపీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఆ తర్వాత ఎన్నికలు ముగిశాక వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా తెరకెక్కించారు. అసలు ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు… దీనిపై అభ్యంతరాలు రావడంతో టైటిల్ మార్చారు. ఈ సినిమాలో కూడా వర్మ లోకేష్ . చంద్రబాబును టార్గెట్ గా చేసుకునే తీశారు.
ఆ తర్వాత కూడా వర్మ చంద్రబాబు, టీడీపీని, లోకేష్ను వరుసగా టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో సైటైర్లు వేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా పై తెలుగు సినిమా, రాజకీయ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. వర్మ పొలిటికల్ గా తీసిన సినిమాలు ఏవైనా పెద్ద సంచలనం క్రియేట్ చేయడంతో వ్యూహంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి కావడంతో టీజర్ కూడా రిలీజ్ చేశారు. 2009లో వైఎస్ హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించడం దగ్గర నుంచి టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఏపీ రాజకీయాలు ఎలా ? మారాయి ? రోశయ్య సీఎం కావడం.. జగన్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పడం.. బయటకు వచ్చి పార్టీ పెట్టడం.. జగన్ను అరెస్టు చేయడం లాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే టీజర్లు డైలాగులు లేవు. చివర్లో మాత్రం జగన్ పాత్రాధిరి నేనలా చేయడానికి చంద్రబాబును అనుకున్నావా ? అని చెప్పి టీజర్ ముగించారు. ఇదంతా చూస్తుంటే జగన్ వ్యూహంగా.. జగన్ కోణంలో… జగన్ను హైలెట్ చేసేందుకు వర్మ తెరకెక్కిస్తోన్న వ్యూహంగా కనిపిస్తోంది.