టాలీవుడ్లో ఇటీవల కాలంలో సీనియర్ హీరోలు మాత్రమే కాదు.. జూనియర్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు.. తమ తోటి హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసలు త్రిబుల్ ఆర్ సినిమా లాంటి చరన్ – ఎన్టీఆర్ కలిసిన మల్టీస్టారర్ వచ్చాక చాలా మంది హీరోలు కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
టాలీవుడ్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఓ కొత్త కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకు ఆ హీరోలు ఎవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ-విష్వక్ సేన్-మంచు మనోజ్ లు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఓ యంగ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. కలర్ ఫొటో సినిమా తీసిన దర్శకుడు సందీప్ రాజ్ తయారు చేసుకున్న ఈ కథ లో హీరోగా రవితేజను ఓకే చేశారట.
ఈ కథలో హీరోగా రవితేజ, విలన్ గా మంచు మనోజ్ నటిస్తారు. అయితే మరో కిల్లర్ పాత్రలో మరో యంగ్ హీరో విష్వక్ సేన్ నటిస్తాడని.. విశ్వక్ సేన్ రోల్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని చెపుతున్నారు. ఈ ముగ్గురు హీరోల కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజీ కాంబినేషనే అని చెప్పాలి. ఈ సినిమాను ఎవరు ? నిర్మిస్తారు.. ఏయే బ్యానర్లు కలుస్తాయి అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఈ సినిమాను ఏ బ్యానర్ నిర్మిస్తుంది అన్నది రవితేజ డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న గోపీచంద్ మలినేని – మైత్రీ సినిమా… ఆ తరువాత సితార బ్యానర్ సినిమా ఉంటాయి. ఈ రెండు సినిమాల తర్వాతే ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరమీదకు వెళ్లవచ్చు.