టాలీవుడ్లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి నటించగా సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో అనే మల్టీస్టారర్ సినిమాలో నటించారు ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకులకు ముందుకు రానుంది.
అంతే కాకుండా ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి- రవితేజ కలిసి నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడూ నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య.. ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మరో బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతే కాకుండా ఈ సినిమాతో తన కెరీర్ లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన వన్ ఆఫ్ ది బిగ్ సినిమాగా రికార్డ్ నెలకొల్పింది వీర సింహారెడ్డి. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మెగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్- నయనతార హీరోయిన్లగా కన్ఫర్మ్ అయ్యారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు మరో స్టార్ హీరో నటిస్తున్నాడని… కూడా ఆ హీరో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ఈ సినిమాలో బాలయ్యతో కలిసి నటించబోతున్నారట. బాలకృష్ణకు రవితేజ మధ్య ఎంత బాండింగ్ ఉందో గతంలో వచ్చిన అన్ స్టాపబుల్ షోలో చూసాం. ఇక ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న ప్రేమతో బాలయ్యతో ఒక్క సినిమాలో అయినా కలిసిన నటించాలని అనుకున్నారట.
ఇప్పటికే బాబీతో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవితో కూడా కలిసి నటించిన రవితేజ. మరోసారి బాబీ డైరెక్షన్లో బాలయ్యతో చేసే సినిమాలో కూడా నటించబోతున్నారంటూ తెలుస్తోంది. బాబీ తొలి సినిమా రవితేజతో చేయడంతో రవితేజకు బాబీకి మంచి స్నేహ సంబంధం ఏర్పడింది. ఇక ఆ కారణంతోనే బాబీ చెప్పిన కథకు రవితేజ ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఇందులో ఎంతవరకు నిజమందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.