నీయ‌మ్మా అంటూ న‌వ్వుతూ ప‌చ్చి బూతు మాట్లాడిన శ్రీవ‌ల్లి… ( వీడియో )

కన్నడ భామ రష్మిక మందన టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కి అడుగుపెట్టిన రష్మిక వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. అల్లు అర్జున్ హీరోగా తరికెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న రష్మిక తనకు ఉన్న అద్భుతమైన టాలెంట్ బ‌య‌ట పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఏకంగా ఆరు భాషల్లో మాట్లాడుతానంటూ చెప్పుకొచ్చిన శ్రీవల్లి ఇటీవల తాజాగా తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గ‌త కొంత‌కాలంగా హైదరాబాదులోనే ఉంటున్న రష్మిక కొన్ని తెలుగు పదాలను ఎంతో స్పష్టంగా తెలంగాణ యాసలో మాట్లాడింది. నమస్తే, ఎట్లున్నారు..? వచ్చేసేయ్, మస్తుంది, నీ అమ్మ, ఏంది, కొడదాం.. అంటూ అసలు సిసలైన తెలంగాణ యాసలో కొన్ని పదాలను మాట్లాడి అందరిని మెస్మ‌రైజ్ చేసింది.

గతంలో రష్మిక – విజయ్ దేవరకొండ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ అనేక వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా రష్మిక తెలుగులో ఇంత‌ స్పష్టంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ యాస విజ‌య్ అన్న‌ నేర్పించాడా వదినా అంటూ కొంద‌రు విజ‌య్ అభిమానులు, నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

దేవ‌ర‌కొండ ఫ్యాన్స్. రష్మిక మందన తెలుగు భాషలోనే కాక తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా మాట్లాడతానని చెప్తుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది రష్మిక. సందీప్ వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన ర‌ష్మిక‌ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 1న‌ రిలీజ్ కానుంది.