ప్రస్తుతం బుల్లితెర టాప్ స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది రష్మీ గౌతమ్. జబర్దస్త్ షో తో యాంకర్ గా పరిచయమైన రష్మీ వెండి తెరపై కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోయిన్ అవుదామని లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మీ అంతగా సక్సెస్ కావుపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల తను హోస్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో రష్మీ పై కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు రామ్ ప్రసాద్.
దీంతో ఈ వ్యాఖ్యలు రష్మిని అవమానించినట్లు ఉన్నాయంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ షోలో చాలా సార్లు హైపర్ ఆది డబల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎంతోమంది నటులకు కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ ప్రసాద్ ఇలా డబల్ మీనింగ్ డైలాగ్స్ తో కౌంటర్ వేయడానికి తయారయ్యాడు. తాజాగా జరిగిన ఓ స్కిట్ లో భాగంగా రష్మీ ని రాత్రికి వస్తావా? అంటూ రామ్ ప్రసాద్ చిల్లర డైలాగ్ అడగగా.. రష్మీ నన్నెందుకు రమ్మంటున్నావ్? అంటూ సమాధానం ఇచ్చింది. రాత్రికి ఎందుకు రమ్మంటారో తెలియదా అంటూ రామ్ ప్రసాద్ తిరిగే అంటాడు. అప్పుడు రష్మితో సహా సెట్ లో అందరు ఆశ్చర్యపోయారు.
దీంతో జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ కోపంగా “ఏం..?” అనేసరికి వెంటనే కవర్ చేసుకుంటూ ..రామ్ ప్రసాద్ ఊరిలో జాతర ఉంది అందుకే ఈవెంట్ కు పిలిచాను అంటూ మరో డైలాగ్ చెప్పాడు. ఇలాంటి కవరింగ్ లు ఇప్పటికే ఈ షోస్ లో చాలాసార్లు జరిగాయి. ఇంతకుముందు యాంకర్ విష్ణు ప్రియ ముక్కుపై ఆమె బాడీ స్ట్రక్చర్ పై కూడా ఎన్నోసార్లు కౌంటర్లు వేసినా విష్ణుప్రియ ఎప్పుడు సీరియస్ గా రియాక్ట్ అవలేదు. అలాగే ఇమ్మెనియల్ , షేకింగ్ శేషు లపై కూడా కామెంట్స్ చేశాడు హైపర్ ఆది. అవకాశాల కోసం వీరు కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం చాలాసార్లు ఈ సంఘటనలను తప్పుపట్టారు.