కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ప్రస్తుతం కోలీవుడ్ లో మీడియా సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. హీరో ధనుష్ నుంచి విడిపోయిన ఐశ్వర్య ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా ఉన్నారు. ఓ వైపు పిల్లల పెంపకంతో పాటు.. ఇటు ఓ మూవీని డైరక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం మామూలుగా లేదు.
సడెన్గా ఐశ్వర్యపై ఇలాంటి పుకార్లు రావడానికి ఓ కారణం కూడా ఉందంటున్నారు. ఆమె గత కొద్ది రోజులుగా ఉంది. ఈమధ్య కోలీవుడ్ కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించింది. రిసార్ట్ లో అతడితో ఆమె కనిపించడంతో ఈ రెండో పెళ్లి పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో ? కాదు శింబు. అయితే ధనుష్ను ఐశ్వర్య ప్రేమించి పెళ్లాడింది.
18 ఏళ్ల వీరి సంసారంలో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ధనుష్పై సుచీలీక్స్ ఆరోపణలు వచ్చినా, ధనుష్ తండ్రి ఎవరు ? అన్నదానిపై లీగల్ ఇష్యూలు వచ్చినా కూడా ఐశ్వర్య ఎంతో అండగా నిలిచింది. అలాంటి వాళ్లు సడెన్గా విడిపోయారు. ఇక ధనుష్తో విడిపోయాక ఐశ్వర్య ఒంటరిగానే ఉంటోంది. భవిష్యత్తులో అయినా తనకు ఓ తోడు కావాలన్న నిర్ణయానికి వచ్చిన ఆమె శింబుతో పాత పరిచయం నేపథ్యంల క్లోజ్గా మూవ్ అవుతోందంటున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లి అంశం తెరమీదకు వచ్చింది. ఇక ఇండస్ట్రీలో రజనీ, ఇటు టి. రాజేంద్ర ( శింబు తండ్రి) ఫ్యామిలీలకు చెందిన సన్నిహితులు వీరి పెళ్లి కుదిర్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.