రాజమౌళి ‘ విజ‌య‌సింహా ‘ సినిమా ఏ హీరోతో ప్లాన్ చేశాడు… ఎందుకు మిస్ అయ్యింది…!

దర్శక ధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ఇది పేరు కాదు ఓ బ్రాండ్. గత కొంతకాలంగా రాజమౌళి సినిమాలో న‌టించాల‌ని ప్రతి నటుడు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి గురువు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాఘవేంద్ర దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న రాజమౌళి టాలీవుడ్ పేరు.. పాన్ ఇండియా లెవెల్ లో పెంచేశాడు. అలాంటి రాజమౌళి రాఘవేందర్రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడిని హీరోగా పెట్టి ఓ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నాడట. కాని ఆ సినిమా మిస్సయింది.

ఎన్టీఆర్ హీరోగా ‘ స్టూడెంట్ నెంబర్ 1 ‘ సినిమాతో సక్సెస్ సాధించిన రాజమౌళి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డ్ అందుకున్నాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాఘవేంద్రరావు కొడుకు కోవెల‌మూడి ప్ర‌కాష్‌ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమా కథ పై 4 నెలల పాటు పనులు కూడా జరిగాయి. ఈ సినిమాకి ‘ విజయ సింహ ‘ అనే పేరు కూడా అనుకున్నారట. హీరోయిన్గా అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ ను సెలెక్ట్ చేశారట.

అదితి బ‌న్నీ తొలి సినిమా గంగోత్రిలో హీరోయిన్గా న‌టించింది. అయితే ఈ సినిమా సెట్స్ వరకు రాకుండానే బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత జాన్ మహేంద్రన్‌ డైరెక్షన్‌లో నీతో అనే సినిమా ద్వారా ప్రకాష్ హీరోగా పరిచయమయ్యాడు. మరోవైపు రాజమౌళి ‘ సింహాద్రి ‘ సినిమా దర్శకత్వం వహించి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రాజమౌళి, ప్రకాష్ వేర్వేరు బాటల్లో ఎవరి ప‌నులో వాళ్లు బిజీ అయిపోయారు.

రాజమౌళి పలు హిట్ సినిమాలుకు దర్శకత్వం వహిస్తూ పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రకాష్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి డైరెక్షన్ లోకి దిగి ‘ బొమ్మలాట ‘, ‘ అనగన‌గా ఓ ధీరుడు ‘, ‘ సైజ్‌జీరో ‘ సినిమాలకు దర్శకత్వం వహించాడు. చివరిగా 2019లో కంగ‌న ర‌నౌత్ హీరోయిన్‌గా ‘ జడ్జిమెంట్ హై క్యా ‘ సినిమాకి డైరెక్షన్ చేశాడు ప్రకాష్.