టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కి వార్ 2 సెట్స్ మీదకు వెళుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా అని.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో పాన్ ఇండియా స్టార్ కూడా నటిస్తాడని సరికొత్త విషయం బయటకు వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా రెండు పార్టీలుగా తీస్తున్నాడట. ప్రశాంత్ తాజాగా ప్రభాస్తో తెరకెక్కిస్తున్న సినిమా కూడా రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక అదిరిపోయే న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా నటించబోతోంది. ఇప్పటికే ప్రశాంత్ టీం ప్రియాంకతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని.. దీనికి తోడు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో నేషనల్ అప్పీల్ కోసం స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంకను తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇండియా – పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా గురించి వస్తున్న అప్డేట్లు వింటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. మరి రేపు థియేటర్లలో ప్రశాంత్ – ఎన్టీఆర్ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తారో చూడాలి.