పాములు సహజంగా ఎవరి జోలికి రావు. అవి వెళ్లే దారిలో ఎవరు అడ్డం వచ్చినా కాటేస్తాయని చాలామంది అంటూ ఉంటారు. పాములు పగబట్టి మరీ చంపుతాయట. వాటికి వాళ్లు వీళ్లు అనే భేదం ఉండదట. అయితే గర్భవతులను మాత్రం పాములు ఏమి చేయవని.. గర్భవతుల జోలికి కూడా పాములు వెళ్ళవని.. పాములు కొని ప్రత్యేక ఇంద్రియాలు కలిగి ఉండడంతో వాటి ద్వారా గర్భవతులను సులభంగా గ్రహిస్తాయని అంటూ ఉంటారు.
గర్భవతులను గుర్తించినంత మాత్రాన కాటు వేయకుండా ఉంటాయా.. అసలు గర్భవతులను పాములు కాటు వేయకపోవడానికి కారణం ఏంటి ? అనుకుంటున్నారన్నది కాస్త ఆసక్తికరమే. పురాణాల ప్రకారం గతంలో ఓ గర్భిణీ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేస్తూ ఉంటుందట. ఆ సమయంలో రెండు పాములు ఆమె తపస్సుకు భంగం కలిపించాయని.. అలా ఆమె తపసుకు భంగం కలిగించడంతో ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సర్ప జాతికి గర్భిణీని చూసిన వెంటనే అంధత్వం కలిగే విధంగా శాపం పెట్టిందని.. అప్పటి నుంచి గర్బిణిని చూసిన పాములు గుడ్డివి అయిపోతాయని.. అందుకే అవి గర్భవతుల దగ్గరకు కూడా రావని బ్రహ్మవైవర్తన పురాణంలో ఉంది.
గర్భవతులు అయిన వారిని పాము కాటు వేయకపోవడానికి కేవలం మతవిశ్వాసం మాత్రమే కాకుండా.. శాస్త్రీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గర్భం దాల్చిన మహిళా శరీరంలో హార్మోన్ల స్వరూపం భిన్నంగా ఉండడంతో పాటు.. ఆమె శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పులు జరుగుతాయి. స్వభావం, రంగు, రూపం అలా చాలా మార్పులు కలుగుతాయి. హార్మోన్ల మార్పిడిని పాములు త్వరగా గుర్తిస్తాయట.
ఇది సైంటిఫిక్ గా నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవు. ఎవరూ పాములను చంపకూడదు.. కడుపుతో ఉన్నవారు అసలు పాములను చంపకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు. ఆ పాములను చంపిన శాపం కూడా తరతరాలు వెంటాడుతాయని పురాణాలు చెబుతున్నాయి.