రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్ . అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ నటించిన సినిమాల్లో కోట్లు ఖర్చుపెట్టిన కంటెంట్ లేక ప్లాప్ అయిన సినిమాలు ఒకసారి తెలుసుకుందాం.
బాహుబలి తర్వాత రిలీజ్ అయిన సహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ మూడు సినిమాలు 400 కోట్ల నుంచి 500 కోట్ల బడ్జెట్ సినిమాలు గా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలపై ప్రొడ్యూసర్స్ కూడా ఓ రేంజ్ లో ఇన్వెస్ట్ చేశారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలు కంటెంట్ విషయంలో ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి అనే చెప్పాలి. దింతో ఈ సినిమాలు 3 బాక్సఫిస్ వద్ద ఫ్లాప్ గా మిగిలాయి.
భారీ లెవల్ లో వి ఎఫ్ ఎక్స్ తో గ్రాఫిక్స్ లతో రూపొందించిన ఈ సినిమాలు ఏవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ అనే పబ్లిసిటీతో ఇప్పటికే ప్రొడ్యూసర్స్ సినిమాలను రిలీజ్ చేసి చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇకపై వచ్చే ప్రభాస్ సినిమాలు కూడా ఇదే తీరులో ఉంటే భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు అనే నిర్మాతలు చెప్తే మాటలపై ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది అని చెప్పవచ్చు.