బాలీవుడ్ కంగనా రనౌత్ గురించి ఇక్కడ తెలియనివారు వుండరు. అది బీద కుటుంబం నుండి బాలీవుడ్లో హీరోయిన్ గా అడుగుపెట్టిన కంగనా బాలీవుడ్ ని రూల్ చేస్తోందని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలతో మరోవైపు వివాదాలతో ఆమె నిత్యం వార్తల్లో ఉంటుంది. ఈ స్టార్ హీరోయిన్ ఏం చేసినా అది టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. తాజాగా ఆమె ఎఫైర్, అబార్షన్ గురించి బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపుతోంది.
2006లో వచ్చిన ‘గ్యాంగ్స్టర్’ అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన కంగనా ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆమెకు బాలీవుడ్లో మరే నటుడికి, నటికి రానన్ని అవార్డులు వచ్చాయి. దాంతో కంగనా పేరు యావత్ ఇండియన్ సినిమాలోనే మారుమోగిపోయింది.
ఇక చాలా కాలం పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసిన కంగనా రనౌత్.. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇది పెద్దగా ఆడకపోవడంతో ఆమె మళ్లీ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లో సైతం నటించి, తన అద్భుతమైన నటనతో కీర్తి శిఖరాలను అధిరోహించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది.
ఇక అసలు విషయంలోకి వెళితే, కంగనా పర్సనల్ విషయంపై బాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ అయినటువంటి ఉమైర్ సంధు చేసిన ట్వీట్ బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ‘2014లో హృతిక్ రోషన్తో డేటింగ్లో ఉన్న సమయంలో కంగనా రనౌత్కు అబార్షన్ చేయించుకుంది’ అంటూ పిచ్చి రాతలు రాసాడు ఉమైర్.
దీంతో అతడు బాలీవుడ్ వర్గాల్లో మరోసారి పెద్ద దుమారాన్నే రేపాడు. ‘అబార్షన్ చేయించుకున్న తర్వాత కంగనా పిచ్చిదానిలా, సైకోలా మారిపోయింది అని, ఈ కారణంగానే ఆమె ఆ తర్వాత ఎంతో మంది సైక్రియార్టిస్టులను కలిసి ఎన్నో థెరఫీలను కూడా చేయించుకుంది!’ అంటూ అందులో చెప్పుకొచ్చాడు. దీంతో కంగనా అభిమానులు ఉమైర్పై కామెంట్ల రూపంలో దాడి చేస్తోన్నారు.