‘ ఆదిపురుష్‌ ‘ కోసం తెలంగాణ‌లో థియేట‌ర్ అద్దాలు బ‌ద్ద‌లుకొట్టిన ప్ర‌భాస్ ఫ్యాన్స్‌…!

ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమా మానియానే ఎక్కడ చూసినా క‌నిపిస్తోంది. అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా.. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌అలీ ఖాన్ రావణాసురుడిగా నటించాడు.

Adipurush: Release Date, Cast, Teaser, Music, World Premiere, Poster,  Budget, Makers And Much More - Majestic Epic of the Year – Tiding24x7

దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ థియేటర్ల వద్ద జైశ్రీరామ్ అనే నినాదంతో ప్రభాస్ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు హిట్ టాక్‌ రావడంతో థియేటర్లో బొమ్మ పడటం ఒక నిమ‌షం ఆలస్యమైన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలో జ్యోతి థియేటర్లో ఆదిపురుష్‌ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడంతో థియేటర్ యజమాన్యంతో ఫ్యాన్స్ గొడవ దిగారు.

థియేటర్లో సిబ్బంది సర్ది చెప్పడంతో అక్కడితో సమస్య సద్దుమణిగింది. కానీ అభిమానులు థియేటర్ లోపలికి వెళ్ళాక అక్కడ అసలు సమస్య మొదలైంది. థియేటర్లో బొమ్మపడ్డాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వారికి డైలాగులు సరిగ్గా అర్థం కావ‌ట్లేదు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ నానా ర‌చ్చ చేశారు. అయినా సౌండ్ సెట్ కాలేదు.

దీంతో అభిమానులు మళ్ళీ గొడవకు దిగడమే కాకుండా థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో అభిమానుల గొడవకు చేసేదేమీ లేక‌ సినిమా ఆపేసి యాజమాన్యం బయటకు పారిపోయారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.