‘ ఆదిపురుష్ ‘ బుకింగ్స్‌తో బుక్ మై షో షేక్‌… ఇండియ‌న్ హిస్ట‌రీలో అన్‌బీట‌బుల్ రికార్డ్ కొట్టేసిన ప్ర‌భాస్‌..!

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఆదిపురుష్‌. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాలు చేసినా అంచ‌నాలు అందుకోలేదు. దీంతో ఇప్పుడు చేసిన ఆదిపురుష్‌పై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Adipurush Ticket Costs Rs 2200 In Delhi Theatre, Multiple Shows Houseful  for Prabhas Film - News18

రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్‌ సీతగా నటించింది. ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్ రావణాసురుడుగా నటించాడు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెర్కెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే బెనిఫిట్ షో మొదటి, షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. ఇదే సమయంలో ఈ సినిమా బుక్ మై షో లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుని మరో క్రేజీ రికార్డు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బుక్ మై షో లో ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ కి అన్ని భాషల్లో కలిపి 1.5 మిలియన్ టికెట్స్ బుక్కయ్యాట.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులో ఏ స్థాయిలో ? ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే స‌రికొత్త రికార్డుగా ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక సినిమా ఫైనల్ రన్ కొచ్చేసరికి ఈ సినిమా వసూళ్లు, బుకింగ్స్ లో స్థాయిలో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందో ? చూడాలి.