పూజా హెగ్డే, శృతీహాస‌న్‌కు వాళ్ల‌తో ఎక్క‌డ చెడింది… అందుకే ప‌క్క‌న పెట్టేశారా ?

కొందరు హీరోల‌కు, కొంద‌రు దర్శకులకు… కొంమంది హీరోయిన్లంటే చాలా ఇష్టం. త‌మ సినిమాల‌లో వాళ్లనే ప‌దే ప‌దే రిపీట్ చేస్తుంటారు. వాళ్ల‌కే అవ‌కాశాలు ఇస్తూ ఉంటారు. అది సెంటిమెంట్ అని కూడా అనుకోవచ్చు.. లేదా మార్కెట్ స్ట్రాట‌జీయో లేదా వారి మ‌ధ్య ఉన్న అనుబంధ‌మో ఇలా ఏదైనా అనుకోవ‌చ్చు. త్రివిక్రమ్ విష‌యానికి వ‌స్తే త‌న సినిమాల‌తో ఒక‌ప్పుడు ఇలియానాను, ఆ త‌ర్వాత స‌మంత‌ను వ‌రుస‌గా రిపీట్ చేసుకుంటూ వ‌చ్చాడు.

ఆ త‌ర్వాత వంతు పూజా హెగ్డేది. పూజ‌తో అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పురంలో త‌ర్వాత గుంటూరు కారం సినిమాకు కూడా ఆమెనే పెట్టుకున్నాడు. అయితే ఎక్క‌డో తేడా రావ‌డంతో ఆమె ప్లేసులో శ్రీలీల‌ను మెయిన్ హీరోయిన్‌గా, మీనాక్షి చౌద‌రిని రెండో హీరోయిన్‌గా తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. అలా త్రివిక్ర‌మ్ త‌న సినిమాల‌లో ఒకే హీరోయిన్‌ను వ‌రుస‌గా రిపీట్ చేసేసుకుంటూ వ‌స్తున్నాడు.

ఇక త్రివిక్ర‌మ్ ఎలాగైతే పూజాహెగ్డేను రిపీట్ చేస్తుంటాడో.. మరో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా త‌న సినిమాల‌లో వ‌రుస‌గా శృతిహాసన్ ను మాత్రమే తీసుకోవాలని తెగ ట్రై చేస్తుంటాడు. బ‌లుపు, క్రాక్‌, వీర‌సింహారెడ్డి సినిమాల్లో శృతీనే హీరోయిన్‌. అయితే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు త‌మ సెంటిమెంట్ హీరోయిన్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు.

త్రివిక్ర‌మ్ గుంటూరు కారం నుంచి పూజ త‌ప్పుకుంది. ఆ ప్లేసులో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి వ‌చ్చి చేరారు. ఇక గోపీచంద్ మ‌లినేని ర‌వితేజ‌తో తీసే సినిమాలో మ‌రో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌లినేని సినిమా అంటే కచ్చితంగా శృతిహాసన్ హీరోయిన్ గా ఉంటుందని అంద‌రు అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఏదేమైనా ఈ మార్పు పై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చాలా గుస‌గుస‌లే న‌డుస్తున్నాయి. ఆ హీరోయిన్ల‌తో వీళ్ల‌కు ఎక్క‌డైనా చెడిందా ? అని కూడా కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు.