నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది పూజా హెగ్డే. టాలీవుడ్ లో అందరు అగ్ర తారల సరసన నటించింది. ఇటివల స్టార్ హీరొల సరసన నటించిన అన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ వేయించుకున్నింది పూజహెగ్డే . వరుస ఫ్లాపులతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి అనుకుంటే తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి కూడా అవుట్ అయిపోయింది పూజ హెగ్డే. దీనికి కారణం పూజ ఓవర్ యాక్షన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
ఇక ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోను వరుస ప్లాపులు ఎదురవడంతో పూజకి సినిమా అవకాశాలు రావట్లేదు. ఇక సినిమాలో పూజ కనిపించడం కష్టమే అనుకునే సమయంలో ఓ స్టార్ హీరో పిలిచి మరి అవకాశం ఇచ్చాడట. అయితే గతంలో పూజ హెగ్డే ఆ హీరో సినిమాలో అవకాశం వస్తే చిన్న హీరోలతో చేయనని చీ కొట్టి అవకాశాన్ని రిజెక్ట్ చేసిందని.. కట్ చేస్తే ఇప్పుడు ఆ హీరో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని తిరిగి పూజా హెగ్డే కి అవకాశం ఇచ్చాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఎవర? స్టార్ హీరో అనుకుంటున్నారా. మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న రవితేజ తను నెక్స్ట్ చేయబోయే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఈ సినిమాకు హీరోయిన్గా పూజ హెగ్డే సజెస్ట్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అవకాశాలు లేకపోవడంతో పూజా హెగ్డే కూడా ఈ సినిమాకు ఓకే చేసిందని సమాచారం. ఈ న్యూస్ వైరల్ అవడంతో ఇక ఈ సినిమా హిట్ కాకపోతే పూజా హెగ్డే ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడం చాలా కష్టం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.