టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2023 ప్రథమార్థం, ద్వితీయార్థం ముగియడంతో అందరూ చివరి అంకం వైపు దూసుకు వస్తున్నారు. 2023 మొదటిలో భారీ సినిమాలే ప్రేక్షకులు ముందుకు వచ్చినా… సమ్మర్లో మాత్రం ప్రేక్షకులను అసలు మెప్పించలేకపోయారు టాలీవుడ్ హీరోలు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకో లేదు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదుపురుష్ సినిమా కూడా ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది.
ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న తృతీయార్థంలో భారీ సినిమాలే వస్తున్నాయి. అలా ముందుగా వచ్చే హీరోలలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. తర్వాత నటసింహం బాలకృష్ణ, యంగ్ హీరో రామ్ వంటి హీరోలు కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ పై ఎవరు ఊహించని ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఆ హీరోలు మరెవరో కాదు విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
వెంకటేష్ ఇప్పటికీ f3 వంటి భారీ సక్సెస్ అందుకుని యువ దర్శకుడు శైలేష్ కొలనుతో సైంధవ్ అనే భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను యువ దర్శకుడు సుజిత్ తెర్కెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
అయితే వెంకటేష్- పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ సినిమాలను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర ఓ అరుదైన వార్ జరగబోతుంది. పవన్ వెంకీ ఫైట్ ఎలా ? ఉండబోతుంది అన్నది ఆసక్తికరమే. గతంలో వీరిద్దరు గోపాల గోపాల సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడి ఎవరు పై చేయి సాధిస్తారో ? చూడాలి.