టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటులు ఆయనకు అభిమానులమని చెబుతుంటారు. ముఖ్యంగా తెలుగులో ఏ హీరోకు రాని ఓపెనింగ్స్ పవన్ సినిమాకు వస్తాయి. ఆయన నుంచి ఏదైనా ట్వీట్, లేదా సినిమా అప్ డేట్ వచ్చిందంటే సోషల్ మీడియాలో కొన్నాళ్ల పాటు అది ట్రెండింగ్ గా ఉంటుంది.
ముఖ్యంగా ఖుషీ సినిమా అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ భూమిక నడుము పవన్ కళ్యాణ్ చూసీ చూడనట్లు చూడడం, తర్వాత వారిద్దరి మధ్య జరిగే వాగ్వాదం వంటి సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. ఆ సీన్ ఇప్పటికీ టీవీల్లో వచ్చిందంటే చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. ఇటీవల కాలంలో వివిధ టీవీ షోలలో చాలా మంది ఈ సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే కోవలో ఇద్దరు చిన్నారులు ఈ సీన్ను రీక్రియేట్ చేసి అలరించారు.
జీ తెలుగు టీవీ ఛానల్లో డ్రామా జూనియర్స్ షో నడుస్తోంది. అందులో పాల్గొనే చిన్నారులు తమ నటనా ప్రతిభను తెలిపేలా స్కిట్స్, సినిమా సన్నివేశాలకు సంబంధించినవి రీక్రియేట్ చేస్తుంటారు. తాజాగా ఓ షోలో ఇద్దరు చిన్నారులు ఖుషీ సినిమాలో భూమిక నడుము చూసే సన్నివేశాన్ని పెట్టారు. వారు చూపిన నటన, పాత్రలకు తగ్గ హావభావాలు వంటివి అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఇందులో కొంచెం మార్పులు చేశారు. జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ భూమిక ఇతరులు ఎగ్జామ్ రాస్తున్నట్లుగా చూపించారు. అందులో కాపీ కొట్టే క్రమంలో జూనియర్ భూమిక నడుమును జూనియర్ పవన్ కళ్యాణ్ చూసినట్లు సీన్ పండించారు.
ఇది చూసిన ప్రేక్షకులు చప్పట్లతో వారిని అభినందిస్తున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో వారు తమ ప్రతిభతో, నటనతో ఈ సీన్ను రక్తి కట్టించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.