ఖుషి VS న‌ర‌సింహానాయుడు ఈ రెండు సినిమాల కోసం కొట్టుకున్న ఫ్యాన్స్‌… పై చేయి ఎవ‌రిదంటే..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమా ఆయన కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ సినిమాలలో ఒకటి. 2001 సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదే సంవత్సరం ఈ సినిమాకు పోటీగా ( స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 27న‌) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా కూడా ప్రేక్షకుల‌ ముందుకు వచ్చింది. ఆ సమయానికి పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

ఆ వరుస విజయాలు తర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ను కూడా మరో లెవల్ కు తీసుకువెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2001 లో వచ్చిన ఖుషి- నరసింహానాయుడు సినిమాలో అప్పటివరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసి తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని తీసుకువచ్చాయి.

ముందుగా సంక్రాంతికి వ‌చ్చిన న‌ర‌సింహానాయుడు చిరంజీవి మృగ‌రాజు, వెంక‌టేష్ దేవీపుత్రుడు సినిమాల‌ను తొక్కేస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోత కోసింది. ఇక ఈ సినిమా థియేట‌ర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకుని స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గానే ఖుషి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ రెండు సినిమాల రికార్డుల కోసం ఇద్ద‌రు హీరోల అభిమానులు పెద్ద యుద్ధాలే చేసుకున్నారు.

ఈ రెండు సినిమాల కలెక్షన్ విషయానికి వస్తే…
బాల‌య్య న‌ర‌సింహానాయుడు సినిమా రూ.22 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది. పవన్ ఖుషి రూ.20 కోట్ల షేర్ ను రాబట్టింది. అంతే కాకుండా నెల్లూరు, ఉత్తరాంధ్ర, గుంటూరు వంటి ప్రాంతాల్లో ఖుషి సినిమా కంటే నరసింహనాయుడు ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన నరసింహానాయుడు రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ఖుషి సినిమా రిలీజ్ అయింది.

అప్పట్లో కలెక్షన్లని ఎన్ని సెంటర్స్ లో సినిమా ఆడింది అన్నదాన్ని బట్టి ఉండేది. న‌ర‌సింహానాయుడు సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, ఖుషి సినిమా 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పై బాలయ్య పై చేయి సాధించాడు.