హీరోయిన్ పూనమ్ కౌర్ ఆదివారం చేసిన ట్వీట్ ఇప్పుడు పవన్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. ఆ ట్వీట్ దెబ్బతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులకు విపరీతమైన కోపం వచ్చినట్లుంది. అందుకే వాళ్లంతా పూనమ్ను టార్గెట్గా చేసుకుని రెచ్చిపోయి మరీ కామెంట్లు చేస్తున్నారు. పూనమ్ ఏం ట్వీట్ చేసిందో ముందుగా ఓ సారి చూద్దాం.
పూనమ్ ట్వీట్లో “స్త్రీల సమస్యలపై మహా శ్రధ్ధ ఉన్నట్టు గొంతు చించుకుని అరుస్తున్న వీళ్ళు మహిళా రెజ్లర్ల కష్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. వాళ్లకు సొంత లాభం… సౌకర్యాలే ప్రధానమైన కుహనా నాయకులతో జాగ్రత్త గా ఉండండి” అంటూ పూనమ్ కౌర్ వార్నింగ్తో ఓ ట్వీట్ చేశారు. దీనికి తోడు ఆమె హ్యాష్ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా పెట్టింది.
ఆమె ట్వీట్ చూస్తేనే ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఇది పరోక్షంగా పవన్ను ఉద్దేశించి చేసిందే అని క్లారిటీ వచ్చేసింది. పైగా ఇది ఏపీ రాజకీయాలతో ముడిపడి ఉందని కూడా తెలిసిపోతోంది. పవన్ రీసెంట్గా వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఏపీలో ఒంటరి మహిళలు, వితంతువుల అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ పవన్ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు తనకు ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు కూడా చెప్పాయన్నారు.
అయితే పూనమ్ పేరు చెప్పకుండానే పవన్ను ఆడుకునేందుకు ట్రై చేసింది. అసలే ఇటు వారాహి యాత్రలో పాల్గొంటూ పవన్ దూసుకు పోతున్నాడు. ఈ టైంలో పూనమ్ తమ అభిమాన హీరో క్రేజ్ను తగ్గించేలా.. ఇలా డైవర్ట్ అయ్యేలా కామెంట్ చేయడం సహజంగానే పవన్ ఫ్యాన్స్కు నచ్చలేదు. దీంతో వారంతా పూనమ్ను పచ్చి బూతులతో తిడుతున్నారు.