పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ సినిమా బ్రో. కోలీవుడ్ లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు రీమేక్గా బ్రో తెరకెక్కుతోంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్రో సినిమా జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి, పవన్, మెగాభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా బ్రో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు టాక్ ప్రకారం బ్రో సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.
తొలిసారిగా అటు మేనమామ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్నారంటే భారీ అంచనాలే ఉంటాయి. అయితే ఆ స్థాయి అంచనాలు ఎంత వరకు అందుకుంటుందన్న డౌట్ అయితే ఉందంటున్నారు. ఓవరాల్గా సినిమా అయితే అటు కామెడీతో పాటు ఇటు ఎమోషన్, ఫ్యామిలీ అందరూ కలిసి కట్టుగా చూసే సినిమా అంటున్నారు. అయితే మరీ భయంకరమైన బ్లాక్బస్టర్ అయితే కాదని ప్రస్తుతానికి వినిపిస్తోన్న టాక్ ?
ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ బ్రో సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించారు.