ఇది నిజంగా పవన్కు ఘోర అవమానం లాంటిదే. పవన్ కళ్యాణ్ స్టామినాపై దిల్ రాజుకు నమ్మకం లేనట్టుగా ఉంది. అసలు మ్యాటర్లోకి వెళితే పవన్ కళ్యాణ్ పైగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి నటించిన బ్రో సినిమా మరో 17 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇప్పటికే బిజినెస్ అయిపోవాలి.
అయితే బ్రో నైజాం హక్కులు ఇంకా ఓ పట్టాన తెగడం లేదు. ఈ సినిమాకు నైజాంలో జిఎస్టీతో కలిపి రు. 35 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కోసం నిర్మాతలు పట్టుబడుతున్నారు. అంటే జీఎస్టీ కాకుండా రు. 29 కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన చూసుకున్నా కూడా భీమ్లానాయక్ కంటే రు. 2 కోట్లు అడుగుతున్నారు. అయితే ఇది రిస్క్ అని దిల్ రాజు భావిస్తున్నాడట.
ఓ వైపు సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇంకా భేరసారాలు నడుస్తూనే ఉన్నాయి. వాస్తవానికి నైజాంలో పవన్ సినిమా రేంజ్ ఎందుకో పెరగడం లేదు. సరైన మాస్ కమర్షియల్ సినిమా పడకపోవడం కూడా పవన్కు పెద్ద దెబ్బే. అయితే ఇదే టైంలో బన్నీ, మహేష్ లాంటి హీరోల సినిమాల రేట్లు బాగా పెరిగిపోయాయి.
మహేష్ గుంటూరు కారం సినిమా నైజాం 45 కోట్లకు ఇచ్చారు… మరి ఇటు పవన్ – సాయిధరమ్ ఇద్దరూ కలిసి ఉన్నా కూడా రు. 30 కోట్లు ఇచ్చేందుకు కిందామీదా పడుతున్నారు. ఇక దిల్ రాజు ఈ సినిమా రైట్స్ కొనేందుకు రు. 30 కోట్లు పెట్టేందుకు తటపటాయించడం పవన్కు అవమానం లాంటిదే. ఒక వేళ రాజు వెనక్కు తగ్గితే మైత్రీ వాళ్ల ముందు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం తప్ప మరో మార్గం ఉండదని టాక్ ?