‘ బ్రో ‘ సినిమాకు ఆ మూడు థియేట‌ర్ల‌లో అప్పుడే అంత క‌లెక్ష‌నా… ఇది ‘ ప‌వ‌ర్ ‘ స్టార్ అంటే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన “బ్రో” సినిమా ఈనెల 28న రిలీజ్ కానుంది. కానీ సినిమా గురించి ఎటువంటి హడావిడి కనిపించడం లేదు. సినిమా ర‌న్ టైం 135 నిమిషాల వ‌ర‌కు క‌ట్ చేశార‌ని బ‌య‌ట ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “వారాహి విజయ యాత్ర”లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో మరో హీరో పాత్రను పోషించిన సాయి ధరమ్ తేజ్ ప్ర‌మోషన్స్ బాధ్యతలు మొత్తం తీసుకున్నాడు.

తిరుపతిలో రెండో సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజర్ అవుతున్నాడు. దీని తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ రాబోతున్నాయని అంటున్నారు. ఈ సినిమా డైరెక్టర్ సముద్రఖని, హీరోయిన్ కృతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్ కూడా పలు ఇంటర్వ్యూలో పాల్గొబోతున్నారు. ఈనెల 22న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్ నీ గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు.

తమిళ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం సినిమాకు రీమేక్‌గా ఈ బ్రో మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చంబూరు తనికెళ్ల భరణి కీలక పాత్రలు వహిస్తున్నారు. ఈ సినిమా టికెట్ రేటుపై చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు అమెరికాలో స్టార్ట్ అయ్యాయి.

డ‌ల్లాస్‌లోని మూడు థియేట‌ర్ల‌లో అలా టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారో లేదో వెంట‌నే కేకుల్లా అమ్ముడ‌య్యాయి. ఇప్ప‌టికే 50 వేల డాల‌ర్లు వ‌చ్చేశాయి. ఈ దూకుడు చూస్తుంటే ప్రీమియ‌ర్ల‌తోనే ఈజీగా బ్రో మూవీ 1 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేస్తుందంటున్నారు.