మన తెలుగు సీనియర్ స్టార్ హీరోలో బాలకృష్ణ- చిరంజీవి మధ్య చాలా కాలం నుంచి బాక్స్ ఆఫీస్ వార్ జరుగుతూనే ఉంది. ఇద్దరు హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలని హిట్ చేయాలని సినిమాలపై భారీ క్రేజ్ తీసుకువస్తూ ఉంటారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాలతో పోటీ పడినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది సంక్రాంతి కూడా ఈ ఇద్దరు ఒకే బ్యానర్ నుంచి చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రాగా, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు.
ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా వాల్తేరు వీరయ్య మాత్రం నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ఈ సంక్రాంతికి చిరు బాలయ్య వార్లో చిరంజీవి కాస్త పై చేయి సాధించాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరి హీరోలు రెండో సీజన్లో మరోసారి బాక్సాఫీస్ వార్కు రెడీ అవుతున్నారు. చిరంజీవి బోళా శంకర్ సినిమాతో ఆగస్టు లేదా దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బాలకృష్ణ కూడా వరుస విజయలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా భగవంత్ కేసరి చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరు హీరోలు మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. బాలయ్య సొంత కథతో వస్తుంటే చిరు రీమేక్ కథతో వస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఒకవైపు.. వర్సెస్ డిజాస్టర్ లతో సినిమాలకు దూరమైన మేహర్ రమేష్ ఒకవైపు.
ఇక ఇప్పుడు ఏ విధంగా చేసుకున్న ఈసారి మాత్రం బాలయ్య ఫుల్ ఫామ్ లో రాడ్ దింపబోతున్నాడని తెలుస్తుంది. బోళా శంకర్ హిట్ అనేది మెగాస్టార్ మానియా మీద ఆధారపడి ఉంటుంది. ఇసారీ బాలయ్య కచ్చితంగా బంపర్ హిట్ కోట్టబోతున్నాడు.