ఎన్టీఆర్ – ఏఎన్నార్‌ను నేల‌మీద కూర్చోపెట్టిందెవ‌రు.. అస‌లేం జ‌రిగింది..!

టాలీవుడ్‌లో అలనాటి స్టార్ హీరోలుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఇంత మంచి స్టేజ్లో ఉండ‌టానికి ప్రత్యక్షంగా వారు కూడా ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ఒకప్పుడు మద్రాస్‌లో ఉన్న సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కి తరలించడంలో ఎంతో కృషి చేశారు. అలాంటి వీళిద్ధ‌రు అప్పట్లో హీరోలుగా కాకుండా ఎంతోమంది సినీ ల‌వ‌ర్స్ ఆరాధ్య దేవుళ్లుగా కనిపించేవారు.

తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన పెద్ద హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రధాన స్థానంలో ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వారికి కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవట. ఇప్పటిలాగా హీరో, హీరోయిన్ ఛాయిస్ లు కాకుండా నిర్మాతలు, దర్శకులు చెప్పే మాటకే హీరో, హీరోయిన్లు ఫిక్స్ అయ్యేవారట. వారి మాటనే గౌరవించే వారట. రెమ్యున‌రేష‌న్‌ కూడా ఇప్పటిలాగా హీరో, హీరోలు డిమాండ్ చేయడం కాదు.. నిర్మాతలే ఫిక్స్ చేసి చెప్పేవారట.

అలా ఏఎన్నార్, ఎన్టీఆర్ వారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ తీసుకొని ఎన్నో సినిమాల్లో నటించారు. మద్రాస్ నుంచి ఇండస్ట్రీని హైదరాబాద్‌కి తీసుకు వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి తెలుగు ఇండస్ట్రీకి మంచి గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే నటనాపరంగా ఎన్నో వైవిధ్యమైన‌ పాత్రలో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ దేవుడు పాత్రలలోను తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. నటనతోనే కాక తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు ఎంతో సహాయం చేశాడు.

ఇలా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీలో అంతటి గొప్ప స్థాయికి చేరుకోవడానికి నటనలో వారి టాలెంట్‌తో పాటు సహనటులతో స్నేహపూర్వకంగా గౌరవంగా మెలిగే వారి గుణం కూడా ఓ కారణం. బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి కుర్చీలో కూర్చోగా వారి ముందు నేలపై ఎన్టీఆర్, ఏఎన్నార్ మరియు ఇతర నటులు కింద కూర్చున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ దర్శక, నిర్మాతలని ఎలా గౌరవించేవారు అనేదానికి ఇది ఓ ఉదాహరణ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతుంది.