టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఏడాది మార్చిలో త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో 2018లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ఏకంగా నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని త్రిబుల్ ఆర్ సినిమాలో నటించాడు. ఆ సినిమా వచ్చి ఏడాది దాటుతున్న ఎన్టీఆర్ నటించిన సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఏడాది గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ 30వ సినిమా ఇటీవల పట్టాలు ఎక్కింది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ – సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 వ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ నటించే 32వ సినిమాపై కూడా అప్పుడే అదిరిపోయే అప్డేట్ వస్తోంది. డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయాడు.
ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వాస్తవానికి త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కంటే ముందు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. అయితే కథలో ఎన్టీఆర్ కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో అది పట్టాలు ఎక్కలేదు. దీంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో కమిట్ అయితే.. ఎన్టీఆర్ కొరటాల శివతో కమిట్ అయ్యాడు .ఇక ఇప్పుడు గురూజీ మహేష్ బాబు సినిమా తర్వాత ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తానని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
ఇందుకు సంబంధించి అదిరిపోయే కథ రెడీ చేసుకుంటున్నానని.. ఎన్టీఆర్కు కాల్ చేసి చెప్పినట్టు సమాచారం. ఎన్టీఆర్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అరవింద సమేత తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అయితే కచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనటంలో సందేహం లేదు. అయితే వచ్చే ఏడాది చివరినాటికి గాని ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు అప్పటి వరకు ఎన్టీఆర్కు కొరటాల శివ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి చేయడంతోనే టైం సరిపోతుంది.