మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకుల బంధం చివరి దశకు చేరుకుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. అయితే ఈ బంధం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. డిసెంబర్ 9, 2020లో ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వీరు పెళ్లి అయిన ఏడాది నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొంతకాలం నుంచే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
అయితే ఎట్టకేలకు వీరు ఇక కలిసి ఉండలేమంటూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో పిటిషనర్ నెంబర్ 1 గా చైతన్య పేరు ఉండగా.. పిటిషనర్ నెంబర్ 2 గా నిహారిక పేరు కనిపిస్తోంది. అయితే వీరిద్దరూ విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తులో పర్సనల్ అడ్రస్ తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. 1955 హిందూ వివాహ చట్టం 13 ( 8) ప్రకారం వీరిద్దరు పిటిషన్ ఫైల్ చేశారు.
ఇక వీరిద్దరు పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్టు కూడా ప్రకటించేశారు. ఏదేమైనా యేడాది కాలంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ వస్తోన్న రకరకాల వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. వీరు త్వరలోనే వేర్వేరు దారుల్లో ప్రయాణించనున్నారు. ఇప్పటి వరకు అనధికారికంగా విడిపోయారు. పైకి మాత్రం అధికారిక భార్యభర్తలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా విడిపోయి ఎవరి జీవితాల్లోకి వారు వెళ్లిపోనున్నారు.