నిహారిక – జొన్నలగడ్డ చైతన్య వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ అనేక వార్తలు మీడియాలో వైరల్ అయినా వీరు ఆ వార్తలపై మునుపెన్నడు స్పందించలేదు. రీసెంట్గా వీరిద్దరి విడాకుల దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ విడిపోయిన విషయం నిజమేనని క్లారిటీ వచ్చేసింది.
ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటా ? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రపంచాలకు చెందిన వారు. చైతన్య సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి కాగా.. నిహారిక సినీ ప్రపంచానికి సంబంధించిన పిల్ల.. కావడంతో వీరి ఆలోచనలు కలవలేదని దీనివల్ల వీరిద్దరికీ పరస్పరం గొడవలు జరుగుతూ ఉండేవని ఇదే వారిద్దరు విడిపోవడానికి కారణమని వార్తలు వినిపించాయి.
తాజాగా వీరిద్దరూ విడిపోవడానికి మెగా ఫ్యామిలీ చేసిన తప్పే కారణం అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా టైంలో కూడా వీరిద్దరు పెళ్లి ఎంతో అట్టహాసంగా రాజస్థాన్ కోటలో జరిగింది. వీరి పెళ్లిని నేషనల్ మీడియా కూడా కవర్ చేసిందంటే ఏ రేంజ్ లో వీరి వివాహం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వివాహ సమయంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అని రకరకాల ఫోటోషూట్స్ కి ఎక్కువ సమయం గడుపుతూ శాస్త్రోక్తంగా పెట్టిన ముహూర్తంలో వీరిద్దరి పెళ్లిని జరిపించకుండా ఆలస్యం చేశారట. దీంతో వీరి పెళ్లికి పండితులు నిర్ణయించిన బ్రహ్మ ముహూర్తం మిస్ అయిపోయిందట. అలా పరోక్షంగా నిహారిక పెళ్లి పెటాకుల అవడానికి మెగా ఫ్యామిలీ అంటూ ఆ కారణం వల్లే వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.