నారా లోకేశ్‌కు త‌ప్పిన పెను ప్రమాదం.. అస‌లేం జ‌రిగిందంటే..!

టీడీపీ యువ‌నేత నారా లోకేష్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ప్ర‌స్తుతం లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లోకేష్ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట‌ర్ అయిన‌ప్పుడు జ‌నం తండోప‌తండాలుగా ఎలా వ‌చ్చారో చూశాం. ఈ క్ర‌మంలోనే లోకేష్ పాద‌యాత్ర సోమ‌వారం దర్శి నియోజకవర్గంలోకి ఎంట‌ర్ అయ్యింది.

పాదయాత్రలో జనం మీద పడటంతో లోకేశ్ ఉక్కిరి బిక్కిర‌య్యారు. ఈ తోపులాటలో 3 సార్లు లోకేష్‌ కింద పడబోయాడు. అయితే వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తతతో లోకేశ్ కు పెద్ద ప్ర‌మాదం తప్పింద‌నే చెప్పాలి. రోజు రోజుకు లోకేష్ పాద‌యాత్ర‌కు జ‌నాల తాకిడి ఎక్కువ‌వుతోన్న విష‌యం పాద‌యాత్ర‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.