టీడీపీ యువనేత నారా లోకేష్కు పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ అద్దంకి నియోజకవర్గంలోకి ఎంటర్ అయినప్పుడు జనం తండోపతండాలుగా ఎలా వచ్చారో చూశాం. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర సోమవారం దర్శి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యింది.
పాదయాత్రలో జనం మీద పడటంతో లోకేశ్ ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ తోపులాటలో 3 సార్లు లోకేష్ కింద పడబోయాడు. అయితే వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తతతో లోకేశ్ కు పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. రోజు రోజుకు లోకేష్ పాదయాత్రకు జనాల తాకిడి ఎక్కువవుతోన్న విషయం పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తోంది.