నమ్రత శిరోద్కర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్క‌ర్‌ ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో కలిసి ‘ వంశీ ‘ సినిమాలో నటించింది న‌మ్ర‌త‌. మహేష్ తో కలిసి ఈ సినిమాలో నటించేటప్పటికి మహేష్ కన్నా నమ్రత పెద్ద స్టార్ గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు సినిమా తర్వాత నమ్రత , చిరంజీవితో ‘ అంజి ‘ సినిమాలో మాత్రమే నటించింది. అప్పటికే నమ్రత – మహేష్ బాబు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు.

ఇక మహేష్ ను నమ్రత పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టాడట మహేష్ బాబు. నమ్రత కూడా దానికి ఓకే చేసింది. మహేష్ బాబు నమ్రత పెళ్లికి అందరూ ఓకే చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘ బాలు ‘ సినిమాలో నమ్రతకు అవకాశం వచ్చిందట. బాలు సినిమాలో గతంలో ఓ హీరోయిన్ పాత్రలో నమ్రతను సంప్రదించారట. ఈ విషయాన్ని నమ్రత – మహేష్ బాబును అడిగిందట. పవన్ కళ్యాణ్ సినిమా అవకాశం వచ్చింది నటించనా అని అడిగితే మన పెళ్లి త్వరలోనే జరగబోతుంది ఈ సమయంలో మళ్లీ కొత్త సినిమా ఒప్పుకోవద్దు చిరంజీవి గారితో ‘ అంజి ‘ సినిమాను పూర్తి చేసి ఊరుకో అని చెప్పేసాడట మహేష్ బాబు.

దీంతో కథ నచ్చినా నమ్రత పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుంది. బాలు సినిమా ప్రేక్షకుల్లో యావరేజ్‌గా నిలిచినా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చి ఉంటే నమ్రత కెరీర్‌లోనే ఈ సినిమా ఎప్పుడు గుర్తు ఉండిపోయేది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ – న‌మ్ర‌త ఫ్యాన్స్ అబ్బా ఓ మంచి కాంబినేషన్ మిస్సయ్యామే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.