హీరోయిజానికి గుడ్ బై చెప్పిన నాగార్జున.. షాక్ లో ఫ్యాన్స్..!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్‌ గత కొంతకాలంగా నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఇటీవల వచ్చిన ది ఘోస్ట్.. సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడం ఘీస్ట్ మూవీ తర్వాత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో సినిమా కమిట్ అయిన నాగార్జున దానికి క్లాప్ కూడా కొట్టినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో నాగార్జున అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కాదు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతోపాటు నాగార్జునపై అనేక ట్రోల్స్ కూడా వచ్చాయి. సీనియర్ హీరోలు మాదిరిగానే నాగార్జున కూడా ఇక సినిమాలో హీరోగా నటించడం మానేసి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే మంచిది అంటూ కామెంట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ధనుష్ హీరోగా శేఖర్ క‌మ్మూలా డైరెక్షన్లో వస్తున్న సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్ట్ కీరోల్‌ ప్లే చేస్తున్నాడట.

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాగార్జున కనిపించడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేసాడని సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. నాగార్జున అభిమానులు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే హీరోగా కూడా చేస్తాడు అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నాగార్జున హీరోగా సినిమాల్లో కనిపిస్తాడో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిక్స్ అయిపోతాడో చూడాలి. ప్రస్తుతం నాగార్జున టాలీవుడ్‌లో ది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.