తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ సినీ బ్యాక్ గ్రౌండ్తో వచ్చిన అక్కినేని హీరోలు ఇండస్ట్రీలో హిట్ సాధించడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అఖిల్, నాగచైతన్య హీరోలుగా కొనసాగుతున్నా గత కొంతకాలంగా ఈ ముగ్గురు హీరోలకు సరైన హీట్ లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చిన్న హీరోస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తు సక్సెస్ అవుతుంటే అక్కినేని హీరోలు మాత్రం కనీసం టాలీవుడ్లో కూడా హిట్ అందుకోలేకపోతున్నారనే నిరాశ భావం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
దీంతో నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ స్టేజ్ పైకి అడుగు పెట్టాడు. ఇక అఖిల్ పలు సినిమాల్లో నటించిన ఒకటి రెండు సినిమాలు మాత్రం అంతకు అంతగానే ఆడాయి. మిగిలినవన్నీ ప్లాప్ లిస్ట్ లోనే నిలిచాయి. ఇక ఇటీవల కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచిన్న నాగచైతన్య కూడా ఫ్లాప్ ని చవి చూశాడు. ప్రస్తుతం నాగ చైతన్య మతం అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఎలా అయినా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు నాగచైతన్య. నాగచైతన్య కొన్ని కరెక్షన్స్ చెప్పాడని డైరెక్టర్ స్క్రిప్ట్ కరెక్షన్ పనిలో ఉన్నాడని ఈ కథ ఫైనల్కి వస్తే నాగచైతన్య విడాకులు నేపథ్యంలో వచ్చే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
నిజజీవితంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికి ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్న మొదటగా నాగచైతన్య సమంత విడాకులనే లాగుతారు. విడాకులు తీసుకున్న చైతన్య విడాకులు నేపథ్యంలో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో చైతన్య, సమంత విడాకుల స్టోరీ ఏమైనా తెలుస్తుందేమో.. నాగచైతన్య చెప్పిన కరెక్షన్స్ వారి లైఫ్ కి సంబంధించిన అంశాలకు లింక్ అయి ఉన్నాయేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ద్వారా అయినా నాగచైతన్య సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.