లావణ్య – వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఈ పేర్లు సోషల్ మీడియాలో వినపడుతూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఇరుకుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యేడాది చివర్లోనే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. తాజాగా లావణ్య త్రిపాఠి అత్త పద్మ ( నాగబాబు భార్య) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పద్మ తనకు కాబోయే కోడలు లావణ్య త్రిపాఠికి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట.
అత్త – కోడలు అంటే సహజంగా ఎప్పుడు గొడవలు పడుతూ.. కీచులాటలు చేసుకుంటూ ఉంటారు. ఈ తరం కోడళ్ళు ఫ్యాషన్గా ఉండాలి లైఫ్ లో ఎంజాయ్ చేయాలి అంటూ ఆశపడుతూ ఉంటారు. అత్తలు పద్ధతిగా ఉండాలి.. నువ్వు చేస్తున్న పనిని ఆపేసి ఇంటిపట్టాన ఉండమని త్వరగా పిల్లల్ని కనేయాలంటూ అనేక రకాలుగా కండిషన్స్ పెడుతూ ఉంటారు. కోడళ్లు వారి కండిషన్లకు ధీటుగా సమాధానం చెబుతూ ఉంటారు.
లావణ్య – పద్మ మాత్రం ఈ తరం అత్తా – కోడళ్ళకి ఆపోజిట్ గా మారిపోయారు. లావణ్యకు అత్త పద్మ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట. పెళ్లి తర్వాత సెపరేట్ కాపురం పెట్టుకోండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. పద్మ – నాగబాబు ఇద్దరు లావణ్య త్రిపాఠి తనకు నచ్చినట్టు ఉండవచ్చని, సినిమాల్లో కూడా నటించినా అభ్యంతరం లేదని, కానీ మెగా కుటుంబం పరుగు తీయకుండా ఎలాంటి పనిచేసిన మేము అభ్యంతరం చెప్పమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
తన కూతురు నిహారిక అత్తారింట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కుందో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లావణ్య తమ ఇంట్లో పడకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లావణ్య కోడలిగా అత్త దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవి పూర్తిగా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తోందట పద్మ. లావణ్య ఆ ఇంటి కోడలిగా మెగా ఫ్యామిలీ పరువు నిలబెడుతూ.. బాధ్యతలు ఎలా? నిర్వర్తిస్తుందో చూడాలి.