ఆ స్టార్ హీరోయిన్ చేసిన మోసంతోనే దేవిశ్రీప్ర‌సాద్ పెళ్లికి దూరంగా ఉన్నాడా.. అస‌లు నిజం ఇదే..!

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలుకు తన మ్యూజిక్ అందించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఈ రాక్ స్టార్ ఈ రీసెంట్ టైమ్స్ లో తన మ్యూజిక్ విషయంలో కాస్త వెనుకబడినా ఏదో ఒక సినిమాతో ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ గతంలో మ్యూజిక్ అందించిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో కొత్తగా చెప్పక్కర్లేదు. మరి కొన్ని సినిమాలయితే దేవి మ్యూజిక్ వల్లే హిట్ అయినా సందర్భాలు కూడా ఎన్నోఉన్నాయి.

అలాంటి ఈ రాక్ స్టార్ 40 సంవత్సరాల వయసు వచ్చిన సరే తన పెళ్లి గురించి ఎలాంటి శుభవార్త బయటకు అందించడం లేదు. మ్యూజిక్ ఈ డైరెక్టర్ ఇప్ప‌టి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం కూడా ఉంది అని టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ వార్త కూడా అందరికీ తెలిసిందే అదే దేవి శ్రీ ప్రసాద్- ఛార్మిల ప్రేమ వ్యవహారం.

గతంలో ఛార్మి- దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఇద్ద‌తరు ఎక్కడికి వెళ్ళినా కూడా జంట‌ గానే కనిపించేవారు. దాంతో వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో ఛార్మి దేవిని పక్కనపెట్టి పూరీ జగన్నాథ్ తో చేరింది.

అప్పటినుంచి దేవిశ్రీప్రసాద్ కి ఛార్మికి గొడవలు మొదలయ్యాయి. వీరిద్దరూ తమ ప్రేమకి బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఛార్మితో విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ పెళ్లి అంటేనే ఆమడ దూరం పడిపోతున్నాడు. ఇదే సమయంలో గతంలో దేవిశ్రీప్రసాద్ మ‌రోనటి పూజిత పొన్నాడ తో రిలేషన్ లో ఉన్నాడు అనే వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం రూమర్ మాత్రమే.

ఛార్మీ హ్యాండ్ ఇవ్వ‌డం వల్ల దేవి ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు అని ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు. కానీ దేవిశ్రీప్రసాద్ సన్నిహితులు మాత్రం ఆయనకు మరో అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ అయిందని, అందుకే ఇప్పటివరకు పెళ్లికి దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో దేవికే తెలియ‌లి.