ఎమ్మెల్యేల్లో కొత్త అల‌జ‌డి… వైసీపీలో డేంజ‌ర్ బెల్స్‌..!

ఏపీ అధికార పార్టీ పెట్టుకున్న ల‌క్ష్యానికి..క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల వ్య‌వ‌హార‌శైలికి ఎక్క‌డా సంబంధం లేద ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అదినేత జ‌గ‌న్‌..వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకుని వైనాట్ 175 నినాదంతో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అప్పులు చేసి కూడా ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతున్నా రు. అయితే.. దీనిని క్షేత్ర‌స్తాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దేచెబుతున్నారు. నాయ‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.

AP Elections: పరిషత్‌ పోరులో.. అధికార పార్టీ ఆధిక్యం |

“మీ అంత‌ట మీరుగా కూడా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టండి. పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనండి. నేను బ‌ట‌న్ నొక్కుతున్నాను. ప్ర‌జ‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు చేరుతున్నాయి. దీనిని అందిపుచ్చుకుని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్య‌త మీపైనే ఉంది“ అని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయినా. కూడా కొంద‌రు నాయ‌కులు కాదుకాదు.. మెజారిటీ నాయ‌కులు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉన్నారు.

ఏమో.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ఏమౌతుందో? అని అనుకునే నాయ‌కులు పెరుగుతున్నారు. దీంతోకార్య‌క్ర‌మాలకు వ‌లంటీర్లు, గృహ సార‌థులు త‌ప్ప పెద్ద‌గా నాయ‌కులు వెళ్ల‌డం లేదు. వెళ్లినా.. అక్క‌డ ముందుగానే ప్ర‌తి ప‌క్షాలు ప్ర‌జ‌ల‌ను ప్రిపేర్ చేస్తున్నాయి. అంటే.. వైసీపీలోనే కొంద‌రుఇంటి దొంగ‌లు.. పార్టీ కార్య‌క్ర‌మాలను ముందుగానే ప్ర‌తిప‌క్షాల‌కు లీక్ చేస్తున్నాయ‌ని.. దీంతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.

YSR Congress Party - Wikipedia

దీనిని తోసిపుచ్చ‌డానికి వీల్లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎందుకంటే..వ‌లంటీర్లు , గృహ సార‌థులు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు ఎలాంటి వ్య‌తిరేక‌తా క‌నిపించ‌డం లేదు. కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు మెజారిటీ ప్ర‌జ‌లు వారిని ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ప‌రిణామం వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇంత చేస్తున్నా..ప్ర‌జ‌లు త‌మ‌కు ఎందుకు వ్య‌తిరేక‌త‌తో ఉన్నారో అర్థం కావ‌డం లేద‌ని.. డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి వ్యాఖ్యానించారు. అంటే..వైసీపీలో నైరాశ్యానికి కార‌ణం ఏంటో తెలుస్తూనే ఉంది.