గ్లోబల్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో తన కెరీర్లోనే దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా మరోవైపు టాప్ బ్రాండ్స్కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కమర్షియల్ యాడ్స్ లో కూడా అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెక్ డొనాల్డ్స్ సంస్థ రీసెంట్గా తన బ్రాండ్ అంబాసిడర్గా ఎన్టీఆర్ ను నియమించుకుంది.
ఇప్పుడు తాజాగా మైక్ డొనాల్డ్స్ యాడ్ లో ఎన్టీఆర్ నటించాడు. ఇక రీసెంట్గా ఈ యాడ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే 30 సెకన్ల యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మైక్ డోనాల్డ్స్ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
ఇదే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికంటే హైయెస్ట్ యాడ్ రెమ్యునరేషన్ అని కూడా అంటున్నారు. ఇంత తక్కువ టైం ప్రకటన కోసం ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటూ మామూలు రచ్చ కాదనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.
వచ్చే ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. ఈ సినిమా తర్వాత కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకు ముందుకు రాబోతున్నాడు. ఇక మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ యాడ్స్ పరంగా సరికొత్త సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.